ఒత్తిడివల్ల కాదు: తెలంగాణపై జెసి, ఓపికపట్టమని దానం

ఆంధ్రప్రదేశ్ను విభజిస్తే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందని సీమాంధ్ర నేతలు కేంద్రాన్ని, అధిష్టానాన్ని హెచ్చరించలేదన్నారు. అలాంటి విషయమే ప్రస్తావించలేదన్నారు. కేవలం సీమాంధ్ర ప్రజల అభిప్రాయాన్ని మాత్రమే వారు పెద్దల దృష్టికి తీసుకు వెళ్లారన్నారు. ముఖ్యమంత్రి మార్పు పైనా ఆయన స్పందించారు. 2014 వరకు కిరణ్ కుమార్ రెడ్డే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని చెప్పారు.
సీమాంధ్రలో సమైక్యం
గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యల అనంతరం కూడా సీమాంధ్ర ప్రజల్లో తెలంగాణ విభజన భయంపోనట్లుగా కనిపిస్తోంది. సమైక్యాంధ్ర జెఏసి నేతలు పలుచోట్ల ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. కృష్ణా జిల్లా గుంటూరులో విద్యార్థులు తెలంగాణ వద్దు సమైక్యాంధ్ర ముద్దు అనే నినాదాలు చేస్తూ రహదారుల వెంబడి ర్యాలీలు నిర్వహించారు. నాటి అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం వృథా కనివ్వమన్నారు. తెలుగు తల్లిని ముక్కలు కానిచ్చేది లేదన్నారు. తిరుపతిలోనూ సమైక్య రాష్ట్రం కోసం ర్యాలీ నిర్వహించారు.
ఓపిక పట్టండి
తెలంగాణ ప్రజలు ఓపికపడితే కేంద్రం నుండి మంచి నిర్ణయం వస్తుందని కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ అన్నారు. రాజీనామాల విషయంలో ఎవరూ ఒత్తిడి తీసుకు రావాల్సిన అవసరం లేదన్నారు. కొద్ది రోజుల్లో ఇరు ప్రాంతాల ప్రజలకు అనుకూలమైన నిర్ణయం వస్తుందన్నారు.












Click it and Unblock the Notifications