ఢిల్లీ గ్యాంగ్ రేప్ విక్టిమ్కి 73 శాతం మార్కులు

ఆ పారా మెడికల్ విద్యార్థినిపై జరిగిన దౌష్ట్యం దేశాన్ని ఊపేసింది. అత్యాచారం చేసిన వ్యక్తులకు కఠిన శిక్ష విధించాలని ఢిల్లీలో నిరసనలు వెల్లువెత్తాయి. జీవితంపై ఎనలేని ఆశతో కఠిన శ్రమ చేస్తూ అంకిత భావంతో తన కెరీర్ను రూపుదిద్దుకోవడానికి ఆమె పడిన తపనను ఆమె తల్లిదండ్రులు, సోదరులు గుర్తు చేసుకుంటున్నారు.
ఆమె అంకిత భావానికి జనవరి 23వ తేదీన విడుదలైన పరీక్షా ఫలితాలు అద్దం పడుతున్నాయి. ఫిజియోథెరపి బ్యాచిలర కోర్సు నాలుగో సంవత్సరం పరీక్షల్లో ఆమెకు 72.7 శాతం మార్కులు వచ్చాయి. ఆమె మరణించిన నెలలోగానే ఉత్తరాఖండ్లోని హేమవతి బహుగుణ గర్వాల్ విశ్వవిద్యాలయం పరీక్షా ఫలితాలు వెల్లడించింది.
ఆమెకు 1100 మార్కులకు గాను 800 మార్కులు వచ్చాయని డెహ్రాడూన్ సంస్థ డైరెక్టర్ చెప్పారు. ఇక్కడే ఆమె ఫిజియోథెరపీ కోర్సు అభ్యసించింది. సబ్జెక్టుల్లో ఆమె ప్రతిభ అసాధారణమైందని ఆయన అన్నారు. ఆమెకు లభించిన మార్కుల పట్ల ఆమె కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ సమయంలో ఆమె లేకపోవడం వారికి విషాదాన్ని మిగిల్చింది.












Click it and Unblock the Notifications