జగన్ పార్టీ బలంగా ఉంది, కష్టాల్లో ఉంది నిజమే: అసద్
వచ్చే నెలలో తాను రాష్ట్రవ్యాప్తంగా జోరుగా పర్యటిస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీకి గట్టి బుద్ధి చెబుతామన్నారు. 2014లో కాంగ్రెసుకు రాష్ట్రంలో నలబై సీట్లు కూడా రావన్నారు. గురువారం అర్ధరాత్రి ఈద్లో పాల్గొన్న అసద్ మాట్లాడుతూ.. తాము హిందువులకు వ్యతిరేకం కాదన్నారు. హిందువులతో ఎలాంటి శతృత్వం లేదన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ఎట్టి పరిస్థితుల్లో ప్రధానమంత్రిని కానిచ్చేది లేదన్నారు.
తాము బిజెపి, ఆర్ఎస్ఎస్లకు మాత్రమే వ్యతిరేకమని, హిందువులకు కాదన్నారు. మేమెంటో 80 లక్షల ముస్లింలకు తెలుసు అన్నారు. వచ్చే ఎన్నికల్లో తమను గెలిపిస్తారన్నారు. కాంగ్రెసు పార్టీ తమను ఉద్దేశ్య పూర్వకంగా వేధిస్తోందన్నారు. ఇక ముందు రాష్ట్రంలో కాంగ్రెసు ఎప్పుడూ అధికారంలోకి రాదన్నారు. మా తడాఖా ఏమిటో 2014లో చూపిస్తామన్నారు. ప్రజలు కూడా అందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
కాంగ్రెసు ప్రభుత్వ హయాంలో మైనార్టీలకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తామన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోసు, డాక్టర్ బిఆర్ అంబేడ్కర్లు గొప్ప నేతలు అన్నారు. గాజులు తొడుక్కొని పాలన చేయడం తెలియదని అసదుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన మండిపడ్డారు.
పాతబస్తీలో బందోబస్తు
మిలాద్ ఉన్ నబీ, శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో పాతబస్తీలో సున్నిత ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముస్లింలు మక్కా మసీదు నుండి మొగల్ పురా వరకు ర్యాలీని చేపట్టారు. ఓ సమయంలో ముస్లింలు చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి గుడి వద్దకు చొచ్చుకు వచ్చే ప్రయత్నాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు.