వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ జైలులో భారత ఖైదీ మృతి: కొట్టడం వల్లనే

By Pratap
|
Google Oneindia TeluguNews

Pakistan Map
ఇస్లామాబాద్: గూఢచర్యం ఆరోపణలపై ఐదేళ్ల జైలు జీవితం పూర్తి చేసుకుంటున్న తరుణంలో పాకిస్తాన్ జైలులో ఓ భారత జాతీయుడు మృతి చెందాడు. జైలు సిబ్బంది అతన్ని తీవ్రంగా కొట్టారని, ఆ దెబ్బలకు తాళలేక రెండు రోజుల తర్వాత మరణించాడని వార్తలు వచ్చాయి. తహెసీన్ ఖాన్ అనే పాకిస్తానీ న్యాయవాది మాటలను ఉటంకిస్తూ మీడియా భారత జాతీయుడి మృతికి సంబంధించిన వివరాలను ప్రచురించింది. ఈ న్యాయవాది ఇటీవలే కోట్ లఖ్‌పత్ జైలు నుంచి విడుదలయ్యాడు.

మీడియా కథనాల ప్రకారం - నల్లా నీళ్లతో దుస్తులు ఉతుక్కున్నందుకు చమేల్ సింగ్‌ను జైలు సిబ్బంది తీవ్రంగా కొట్టారని, ఈ సంఘటన జనవరి 15వ తేదీన జరిగిందని, ఆ తర్వాత రెండు రోజులకు జిన్నా ఆస్పత్రిలో అతను మరణించాడని న్యాయవాది చెప్పాడు.

సింగ్‌ను నిర్దయగా కొట్టారని, మైనారిటీలను దుర్భాషలాడారని ఖాన్ చెప్పాడు. చమేల్ సింగ్ మృతి విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేయాలని పాకిస్తాన్ అధికారులు భారత్‌కు తెలిపారు. ఈ విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు తెలిపారు.

సింగ్ మృతదేహాన్ని భారత్‌కు పంపించాలా, పాకిస్తాన్‌లోనే అతని మృతదేహానికి అంత్యక్రియలు చేయాలా అనే విషయంపై ఆయన కుటుంబ సభ్యుల నుంచి జవాబు కోసం ఎదురు చూస్తున్నారు. జైలులో చమేల్ సింగ్‌ను కొట్టినట్లు తమకు ఏ విధమైన సమాచారం లేదని భారత అధికారులు అంటున్నారు.

English summary

 An Indian national, who was about to complete his five-year imprisonment on charges of espionage, has died in a Pakistani jail, amid reports that he was "mercilessly beaten" by prison staff two days before his death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X