తెలంగాణపై ఇంచార్జ్ ఆజాద్: కేంద్రప్రకటనగానే చూస్తారా?

ఈ నేపథ్యంలో ఆజాద్ ఏం ప్రకటన చేస్తారు? తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తారా? అభివృద్ధి మండలి అంటారా? హైదరాబాదును ఏం చేస్తారు? తదితర అంశాలపై అందరిలోనూ ఉత్కంఠను రేపుతోంది. అదే సమయంలో ఆజాద్ చేసే ప్రకటనను తెలంగాణవాదులు అయినా సమైక్యాంధ్రవాదులు అయినా కేంద్ర ప్రకటనగా చూస్తారా? అనే చర్చ కూడా సాగుతోంది.
ఆజాద్ ఏ ప్రకటన చేసినా ఆయన పార్టీ రాష్ట్ర ఇంచార్జిగానే చేస్తారని అంటున్నారు. ఆయన చేసే ప్రకటన కేంద్ర ప్రభుత్వం ప్రకటనగా కాకపోవచ్చునని అంటున్నారు. అందుకు నాలుగు రోజుల క్రితం ఆయన చేసిన ప్రకటనను ఉదహరిస్తున్నారు. షిండే నెల రోజులు గడువు చెప్పినప్పటికీ బుధవారం ఆజాద్ మాట్లాడుతూ... నెల అంటే నెల కాదని అన్నారు. కానీ, ఆ తర్వాత కేంద్రం తెలంగాణపై తీవ్రస్థాయిలో చర్చించి ఓ నిర్ణయాన్ని చెప్పాలనే అభిప్రాయానికి వచ్చింది.
అప్పుడు ఆజాద్ చేసిన ప్రకటన కేవలం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగానే చూశారు. ఇప్పుడు కూడా ఆజాద్ ప్రకటన చేస్తే అలాగే చూసే అవకాశాలు ఉంటాయన్నారు. అయితే ఆయన ప్రకటన అధికారం కూడా కావచ్చంటున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిగానే ఆయన ఈ రోజు ప్రకటన చేయవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications