భయంతో రాయట్లేదు: మమతకు గంగూలీ చురకలు

ఆత్మకథ రాయాలన్న కోరిక ఉన్నప్పటికీ రష్దీలాగా తన పైనా వివాదాలు వస్తాయో అన్న భయంతోనే ఆ పనిని తాను చేయడం లేదన్నారు. కొన్నిసార్లు అన్ని వివరాలనూ బయట పెట్టలేమన్నారు. అటువంటప్పుడు రాయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. మాజీ క్రికెటర్ పటడీకి సంబంధించిన పుస్తకావిష్కరణ సభలో గంగూలీ ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా వివాదాస్పద రచయిత సల్మాన్ రష్దీ మరోసారి వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోల్కతాలో అడుగుపెడితే మూటకట్టి వెనక్కి పంపేస్తామంటూ తనను హెచ్చరించినట్టు ఆరోపించారు. దానివల్ల గత నెల 30వ తేదీన కోల్కతాకు వెళ్లలేకపోయానని అన్నారు. ఈ మేరకు ఒక పేజీ ప్రకటనను మీడియాకు విడుదల చేసి దేశం విడిచిపోయారు.
ట్విటర్లో ఆయన తన వాదనను వినపించారు. గతనెల 30వ తేదీన కోల్కతా సాహిత్య సమ్మేళనంలో ఆయన పాల్గొనాల్సి ఉంది. ఆయన నవలకు సినిమా రూపం'మిడ్నై ట్ చిల్డ్రన్' ప్రచార కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. కోల్కతా వెళ్లేందుకు సర్వం సిద్ధం చేసుకున్నానని, మరుసటి రోజు బయలుదేరతాననగా కోల్కతా పోలీసులు తనను సంప్రదించారని, ఎట్టిపరిస్థితుల్లో నగరంలోకి అడుగుపెట్టవద్దన్నారని ఆయన చెప్పారు.
పర్యటన గురించి కావాలనే మీడియాకు, ముస్లిం సంస్థలకు మీరు ఉప్పందించారని ఆయన ఆరోపించారు. ఎందుకు రాకూడదని తాను అడిగితే, కోల్కతాలో మత ఘర్షణలు రేపే ఉద్దేశం దీని వెనక కనిపిస్తోందని, దీనివల్ల కోల్కతాకు మీరు రాకూడదనేది మమత ఆదేశమని, కాదని వచ్చారా.. తరువాతి విమానంలోనే మిమ్మల్ని మూటకట్టి వెనక్కి పంపించేస్తామని తన విజ్ఞప్తిగా మీకు మా ముఖ్యమంత్రి చెప్పమన్నారని వారు స్పష్టం చేసినట్లు రష్దీ వివరించారు.
అయితే, రష్దీని తామేమీ పిలవలేదని సాహిత్య సమ్మేళనం నిర్వాహకులు వేరే ప్రకటనలో స్పష్టం చేశారు. దానిపై రష్దీ స్పందిస్తూ.. అది అమర్యాదకరమని, వాళ్లే తన విమానం టెకెట్లు బుక్ చేశారన్నారు. మమత ఒత్తిడి వల్లే వాళ్లలా మాట్లాడి ఉండొచ్చని ఆరోపించారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications