అఖిలేష్ భార్య డింపుల్కు ఫేస్బుక్లో గ్రేట్ ఫాలోయింగ్
ఆమె పేరున ఉన్న రెండు ఫేస్బుక్ పేజీలలో ఇప్పటికే చాలామంది ఫ్రెండ్స్ రిక్వెస్టులు ఉన్నాయి. మరో మూడు పేజీలలో ముప్పయ్యారు వేలకు పైగా ఫాలోవర్స్ను కలిగి ఉన్నారు. అయితే, డింపుల్ యాదవ్ ఫేస్బుక్ స్నేహితులతో ఇంటరాక్ట్ కావడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అయితే ఎప్పటికప్పుడు ఫేస్బుక్లో పలు అంశాలకు సంబంధించి వివరాలను మాత్రం ఉంచుతున్నారు. కాగా రాజకీయ నాయకుల్లో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ 13 లక్షలకు పైగా ఫాలోవర్స్తో టాప్లో ఉన్నారు.
భద్రత కోసం ఏటా 120 కోట్ల ప్రజాధనం
కాగా ప్రముఖుల భద్రత కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది. పదిహేను వందల మంది విఐపిల భద్రత కోసం అఖిలేష్ యాదవ్ సర్కారు ఏటా సుమారు రూ.120 కోట్లు ఖర్చుపెడుతోందని పోలీసు శాఖ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం 1476 మంది ప్రముఖలకు బందోబస్తు కల్పిస్తున్నామని ఐజీ శాంతిభద్రతల ఐజీ బద్రిప్రసాద్ సింగ్ వెల్లడించారు.
సమాజ్వాదీపార్టీ పాలనలో సర్కారీ సురక్ష (ప్రభుత్వం కల్పించే భద్రత)కు ప్రాధాన్యం పెరిగిందని చెప్పారు. వ్యక్తులను ప్రముఖుల జాబితాలో చేర్చడంపై తుదినిర్ణయం రాజకీయనాయకులదేనని, అధికారుల పాత్ర ఏమీ లేదని వెల్లడించారు. తమకూ 'ప్రముఖుల' విభాగంలో రక్షణ కల్పించాల్సిందంటూ దాదాపు పదివేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని వివరించా రు. ఎక్కువమంది పోలీసు అధికారులను ప్రముఖుల భ ద్రతకు కేటాయిస్తే .. సాధారణ జనం ఇబ్బందిపడతారని యూపీ పోలీసు మాజీ చీఫ్ కేఎల్ గుప్తా అభిప్రాయపడ్డారు.