కన్నీళ్లు తుడవాలంటే: జగన్ అడిగారు.. శ్రీహరి చెప్పారు!

రాష్ట్రానికి మళ్లీ మీ అవసరముందని జగన్కు తాను చెప్పానని, ఎందుకు అని అతను తనను అడిగారని, ప్రజల కష్టాలలో ఉన్నారని, వారి కన్నీళ్లు తుడవాలంటే మీరు రావాలని ఆయనకు వివరించానని శ్రీహరి అన్నారు. మొన్నటి ఆయన లేరని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఆయన రక్తం పంచుకున్న జగన్ ఉన్నారని అభిప్రాయపడ్డారు. మాట తప్పని మడమ తిప్పని వారన్నారు.
మీ కోసం ప్రతి సామాన్యుడు నిరీక్షిస్తున్నాడని తాను జగన్కు చెప్పానన్నారు. తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరితే తన స్నేహితులు ఎవరూ భయపడరన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను జగన్ పార్టీ తరఫున ప్రచారం చేస్తానని, పోటీ చేయాలనే కోరిక కూడా ఉందని, జగన్ ఎక్కడి నుండి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడి నుండి చేస్తానని చెప్పారు. జగన్ ఏది ఆశిస్తే అది చేస్తానని శ్రీహరి చెప్పారు.
తనకు అభిమాన గణం బలంగా ఉన్న చోట భారీ బహిరంగ సభ ద్వారా జగన్ పార్టీలో చేరేందుకు శ్రీహరి యోచిస్తున్నారు. ప్రస్తుతం కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని, ఎలాంటి కుమ్మక్కు రాజకీయాలు తెలియని జగన్ వెంట నడవాలని తాను నిర్ణయించుకున్నానని చెప్పారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications