నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహిళల అనుమానాస్పద మృతి: టీచర్ లైంగికవేధింపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Wife dies: Suspects husband
నిజామాబాద్/అదిలాబాద్: వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు మహిళలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. నిజామాబాద్ జిల్లా విద్యానగర్ కాలనీలో ఉమ అనే వివాహిత సోమవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అత్తింటి వారే హత్య చేశారని మృతురాలి తరఫు బంధువులు అత్తవారి ఇంటిని ముట్టడించి ఇంట్లోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.

మనోజ్, ఉమ అనే వారికి ఎనిమిది నెలల క్రితం వివాహమయింది. తాము పెళ్లి సమయంలో లక్షల కట్నం, ద్విచక్ర వాహనం ఇచ్చామని మృతురాలి తల్లిదండ్రులు చెబుతున్నారు. మరోసారి డబ్బులు అడిగినా తాము ఇవ్వలేదన్నారు. నిన్న సాయంత్రం తల్లిదండ్రులకు మృతురాలు ఫోన్ చేసి ఆందోళన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు ఉదయం ఆమె విగతజీవిగా మారింది. దీంతో అత్తింటి వారే చంపారని వారు ఆరోపిస్తున్నారు.

అనంతపురంలో

గుత్తి పట్టణం బిసి కాలనీలో స్వాతి అనే పంతొమ్మిదేళ్ల నవ వధువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గుత్తికి చెందిన రఘుతో బెంగళూరుకు చెందిన స్వాతికి రెండు నెలల క్రితం వివాహం అయింది. కుటుంబ తగాదాల నేపథ్యంలో భర్త కొట్టడంతోనే స్వాతి మృతి చెంది ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. కడుపునొప్పి భరించలేక ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుందని అత్తింటివారు చెబుతున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు.

కర్నూలులో టీచర్ లైంగిక వేధింపులు - దాడి

కర్నూలు జిల్లాలోని ఓ పాఠశాలలో టీచర్ విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఎస్ఎఫ్ఐ విద్యార్థులు పాఠశాలపై దాడి చేసి ఫర్నీచర్, పాఠశాల బస్కును ధ్వంసం చేశారు. స్పెషల్ క్లాసు పేరుతో సదరు టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, గతంలో ఇలాంటివి పలుమార్లు జరిగాయని ఆరోపిస్తున్నారు.

English summary
Two women dead in Anantapur and Nizamabad district on Monday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X