Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వీరప్పన్ అనుచరుల ఉరితీతపై సుప్రీంకోర్టు స్టే

Supreme Court
న్యూఢిల్లీ: గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ నలుగురు అనుచరుల ఉరితీత అమలుపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. ఉరితీత అమలును బుధవారం వరకు నిలిపేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వారి మెర్సీ పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ నెల 13వ తేదీన తిరస్కరించారు. దాంతో శిక్ష తగ్గించాలని కోరుతూ ఆ నలుగురు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

రిట్ పిటిషన్‌పై విచారణను ఈ నెల 20వ తేదీన చేపట్టనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి అల్తమాస్ కబీర్, న్యాయమూర్తులు ఎఆర్ దావే, విక్రమ్‌జీలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ తెలిపింది. ఈ నలుగురి తరఫున న్యాయవాది సమిక్ నారాయణ్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ నలుగురు అనుచరులు కూడా శనివారంనాడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జ్ఞానప్రకాష్, సైమన్, మీసేకర్ మాదయ్య, బిలావేంద్రన్‌లకు 2004లో మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. రెండు దశాబ్దాల క్రితం కర్ణాటకలోని పాలార్‌లో జరిగిన మందుపాతర పేలుళ్ల కేసులో వారికి కోర్టు ఆ శిక్ష విధించింది.

ఆ పేలుళ్లలో 22 మంది మరణించారు. ఈ కేసులో ఆ నలుగురికి 2001లో టాడా ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే, వారికి మరణశిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఆ నలుగురు కూడా ప్రస్తుతం కర్ణాటకలోని బెల్గాం జైలులో ఉన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+