పేలుళ్లపై అమెరికా సాయంకోసం: దుబాయ్నుండి డబ్బు
పేలుళ్లలో పాల్గొన్న ముగ్గురికి హవాలా ద్వారానే డబ్బులు సరఫరా అయినట్లు ఇంటెలిజన్స్ బ్యూరో గుర్తించింది. దీంతో ఎఫ్బిఐ సహకారం తీసుకునేందుకు ఎన్ఐఏ యోచిస్తోంది. దుబాయ్లోని అల్ ఖుజీ ఇండస్ట్రియల్ ఎస్టేట్ నుంచి దిల్సుఖ్ నగర్కు డబ్బు సరఫరా అయినట్లుగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. పేలుళ్ల వెనుక ఇండియన్ ముజాహిదీన్కు చెందిన యాసిన్ భక్తల్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మార్క్ చేసిన పోలీసులు
దిల్సుఖ్ నగర్లో సైకిల్ బాంబు పేలిన ప్రదేశాలని పోలీసులు ఇవాళ మార్కింగ్ చేశారు. ఘటనకు సంబంధించి సాధారణ దర్యాఫ్తులో భాగంగా కోణార్క్, వెంకటాద్రి థియేటర్ల సమీపంలోని ఎ-1 మిర్చి సెంటర్, 107 బస్టాఫ్ల వద్ద సున్నంతో మార్కింగ్ చేశారు. సైకిల్ బాంబుల పేలుళ్లలో ధ్వంసమైన వాహనాల సంఖ్యలను సూచిస్తూ నెంబర్లు వేశారు.
పేలుడు తీవ్రతకు వంద మీటర్ల పరిధిలో దెబ్బతిన్న హోర్డింగులు, దుకాణాల అద్దాలకు సంబంధించిన వివరాలను పోలీసులు నమోదు చేసుకొన్నారు. ఘటనకు జరిగిన ప్రదేశాల్లో శకలాలు తొలగించి శుభ్రం చేసేందుకు ఎన్ఐఏ సంస్థ అనుమతి కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు.