బాబుతో ఇష్టం లేకుండె, చిరుతో అయితే..: కెసిఆర్
శాసన మండలికి తెరాస తరఫున ఎన్నికైన కె.స్వామిగౌడ్, పాతూరి సుధాకర్రెడ్డి మంగళవారమిక్కడ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ను ఆయన నివాసంలో కలిశారు. వారిని అభినందించిన కెసిఆర్, నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిన వరదారెడ్డి అభ్యర్థిత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం.
నల్లగొండలోనూ పార్టీ అభ్యర్థి గెలిస్తే బాగుండేదని కెసిఆర్ అన్నట్లు సమాచారం. "ఇక్కడ ఒక్క చోట ఓడిపోవటం వల్ల అందరూ నన్ను టార్గెట్ చేస్తారు'' అని అసహనం వ్యక్తం చేశారు. "వరదారెడ్డ్ఠి అభ్యర్థిగా పెట్టినా గెలవడని నేను ముందే చెప్పిన. అయినా పార్టీలో కొందరు నాపై ఒత్తిడి తెచ్చి ఆయన పేరును ప్రకటింపజేశారు'' అని చెప్పారు. 2009 సాధారణ ఎన్నికల సమయంలోనూ అలాగే జరిగిందని అన్నారు.
స్వామిగౌడ్ ఎంపికే తన అంచనాలు నిజమవుతాయని చెప్పడానికి నిదర్శనమని గుర్తుచేశారు. వరదారెడ్డి అభ్యర్థిత్వాన్ని కొంచెం ముందుగా ప్రకటించకపోవటం కూడా ఓటమికి కారణమయ్యాయని కెసిఆర్ అభిప్రాయపడ్డారు. యూటీఎఫ్సహా ఇతర అభ్యర్థుల ద్వితీయ ప్రాధాన్య ఓట్లు వరదారెడ్డికి ఎక్కువగా పడకపోవటాన్ని ప్రస్తావించారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ గా మహమూద్అలీ గెలుస్తారనే ధీమాను వ్యక్తంచేశారు. అనంతరం స్వామిగౌడ్, సుధాకర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. మండలిలో తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపిస్తామని చెప్పారు.