వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాఠశాలలో మైనర్ బాలిక రేప్: ఢిల్లీలో నిరసనలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Violence in Delhi again
న్యూఢిల్లీ: మైనర్ బాలికపై అత్యాచారానికి వ్యతిరేకంగా శుక్రవారం ఢిల్లీలో నిరసనలు పెల్లుబుకాయి. ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఓ బస్సు అద్దాలు పగులగొట్టారు. ఢిల్లీలోని మంగళ్‌పురిలో గల ఉత్తర ఢిల్లీ నగర పాలక సంస్థ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి జరిగింది.

బాలిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రస్తుతం ఆమె సంజయ్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆస్పత్రి వెలుపల ప్రజలు ఆందోళనకు దిగారు. దీంతో వారిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జీ చేశారు. పాఠశాల ఆవరణలో ఓ వ్యక్తి గురువారంనాడు బాలికపై అత్యాచారం జరిపాడని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. బాలిక తల్లిదండ్రులు శుక్రవారం ఉదయం తమకు ఫిర్యాదు చేశారని, తాము కేసు నమోదు చేశామని ఆయన చెప్పారు.

తనపై దాడికి పాల్పడిన వ్యక్తి ఎవరనేది బాధితురాలు చెప్పలేకపోతోందని అన్నారు. కేసును దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. పాఠశాల పురుష ఉద్యోగులను ప్రశ్నిస్తున్నట్లు, ఉపాధ్యాయులనూ ఓ గార్డునూ విచారిస్తున్నామని చెప్పారు.

తక్షణమే చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగల్‌పురి ప్రజలు స్థానిక పోలీసు స్టేషన్ ఎదుట శుక్రవారం ఉదయం మూడు గంటల పాటు ధర్నా చేశారు. దాంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వారిని చెదరగొట్టడానికి బాటోన్స్ వాడారు.

English summary
Violence once again broke out in New Delhi when a mob on Friday, March 1 pelted stones at the police and broke glasses of a bus protesting against a shocking case of rape.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X