ఎపిపై దృష్టి: బొత్సకు రాహుల్ పరీక్ష, కిరణ్కు పిలుపు!

రాష్ట్ర రాజకీయాలు, 2014 సార్వత్రిక ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలపై సమాలోచనలు చేసి, తగిన సలహాలను, సూచనలు ఇస్తారని సమాచారం. ఈ నెల 18 తర్వాత ఏ క్షణమైనా వీరిద్దరికి రాహుల్ గాంధీ నుండి వీరికి పిలుపు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రాహుల్ గాంధీ అపాయింటుమెంటును బొత్స కోరారు. అలాగే కిరణ్ను కూడా రాహుల్ అదే సమయంలో పిలిచే అవకాశాలు ఉన్నాయి.
కాగా, రాహుల్ వ్యవహార శైలి పిసిసి చీఫ్లకు మింగుడు పడడం లేదట. నాయకత్వ సామర్థ్యాన్ని పరీక్షించడానికి రాహుల్ ఇటీవల పిసిసి చీఫ్లకు నాలుగు పేజీల ప్రశ్నాపత్రాన్ని పంపించారు. దీనిలో "మీరు రాష్ట్రంలో ఎన్ని కిలోమీటర్లు పర్యటించారు? ఎన్ని సభలు నిర్వహించారు? చివరి కార్యవర్గ సమావేశం ఎప్పుడు జరిగింది? రాష్ట్రంలోని కొన్ని ముఖ్యమైన ప్రజా సమస్యలను వివరించండి? తదితర ప్రశ్నలున్నాయట.
దీనికి తోడు వీరిచ్చే జవాబులను కాంగ్రెసు పార్టీ శాసనసభా పక్ష నేత, ఏఐసిసి రాష్ట్ర ఇన్చార్జ్ ప్రధాన కార్యదర్శి కూడా అవి నిజమేనని సంతకం చేయాల్సి ఉంటుంది. దీని వల్ల పిసిసి చీఫ్ ఎవరూ అబద్ధం చెప్పే వీలుండదు. ఇలా రాహుల్ గాంధీ పరీక్ష పెట్టడం పిసిసి చీఫ్లకు మింగుడు పడటం లేదట.












Click it and Unblock the Notifications