వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాస్తా ఊరట: పెట్రోల్ ధర లీటర్‌కు రూ. 2 తగ్గింపు

By Pratap
|
Google Oneindia TeluguNews

Petrol Pump
న్యూఢిల్లీ: పెట్రోల్ వినియోగదారులకు కాస్తా ఊరట లభించింది. పెట్రోల్ ధర లీటర్‌కు రూ. 2 తగ్గింది. ఈ అర్థరాత్రి నుంచే అది అమలులోకి రానుంది. గత 9 నెలల కాలంలో ఇదే అత్యధిక తగ్గింపు. అమ్మకం పన్నును లేదా వ్యాట్‌ను మినహాయిస్తూ ఈ ధర అమలులోకి వస్తుంది. డీజిల్ ధరలో మాత్రం మార్పు లేదు.

వ్యాట్‌ను చేర్చిన తర్వాత లీటర్ పెట్రోల్ ధర ఢిల్లీలో లీటర్‌కు 2.40 పైసలు తగ్గుతుంది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.70.74 పైసల నుంచి రూ. 68.34 పైసలకు వస్తుంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధర తగ్గడంతో పెట్రోల్ ధరను తగ్గించారు. డీజిల్ ధరను మాత్రం మాత్రం నెలకు 40 -50 పైసలు పెంచాలని చమురు సంస్థలు భావించాయి. అయితే, పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున ప్రభుత్వానికి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో దాన్ని అమలు చేయలేదని తెలుస్తోంది.

ఇంతకు ముందు మార్చి 2వ తేదీ చమురు సంస్థలు పెట్రోల్ ధరను లీటర్ 2 రూపాయలు పెంచాయి. ఈ సమయంలో ప్రతిపక్షాలు పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేశాయి. ఫిబ్రవరి నుంచి రెండుసార్లు పెట్రోల్ ధరలు పెరిగాయి. ఫిబ్రవరి 16వ తేదీన లీటర్ పెట్రోల్ ధర రూ.1.50 పైసలు పెరిగింది. మార్చి 2వ తేదీన లీటర్‌కు రూ.1.40 పైసలు పెరిగింది.

డీజిల్ నష్టం ఈ నెల ప్రారంభం నుంచి రూ. 11.26 పైసల నుంచి రూ.8.64 పైసలకు తగ్గింది. ఇంతకు ముందు డీజిల్ ధరను రెండు సార్లు లీటర్‌కు 50 - 51 పైసలు పెంచింది. ఇప్పుడు మూడోసారి పెంచాల్సి ఉంది. కానీ చమురు సంస్థలు వెనక్కి తగ్గాయి.

English summary
Petrol price was today cut by Rs 2 per litre with effect from midnight tonight, the steepest reduction in rates in nine months.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X