తెరాస ఎమ్మెల్యేలపై ఒకరోజు సస్పెన్షన్ వేటు
సస్పెన్షన్ వేటు వేసిన అనంతరం కూడా ఎమ్మెల్యేలు సభలోనే ఉండి నినాదాలు చేశారు. దీంతో మార్షల్స్ వారిని బయటకు తీసుకు వెళ్లారు. కల్వకుంట్ల తారక రామారావు, భిక్షపతి, గంప గోవర్ధన్, హరీష్ రావు, జూపల్లి కృష్ణారావు, నల్లాల ఓదేలు, రాజయ్య, జోగు రామన్న, కొప్పుల ఈశ్వర్, చెన్నమనేని రమేష్, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, విజయ భాస్కర్, ఈటెల రాజేందర్ తదితరులు సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు.
తెలంగాణపై తేల్చక పోవడం వల్ల సమావేశాలు సజావుగా సాగలేకపోతున్నాయని, తెలంగాణపై తీర్మానం పెట్టాలని గూండా మల్లేష్ డిమాండ్ చేశారు. జూలకంటి రంగారెడ్డి కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
జగన్ పార్టీయే కుమ్మక్కు
అధికార కాంగ్రెసు పార్టీతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీయే కుమ్మక్కయిందని టిడిపి నేత దూళిపాళ్ల నరేంద్ర అన్నారు. వారికి కాంగ్రెసుతో బేరసారాలు కుదరక పోవడం వల్ల తమపై విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు.