ప్రియుడి కోసం: యువతి గొంతుకోసిన ఇంటర్ అమ్మాయి
అదే గ్రామానికి చెందిన పదిహేడేళ్ల హరిత సూర్యాపేటలో పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కొద్దికాలంగా రాజశేఖర్ను ప్రేమిస్తున్నానంటూ వెంటపడసాగింది. రాజశేఖర్ ఆమె ప్రేమను తిరస్కరించాడు. ఖమ్మంలో ఉన్న అతడి స్నేహితురాలు తార కారణంగానే రాజశేఖర్ తన ప్రేమను తిరస్కరిస్తున్నాడని భావించిన ఆ బాలిక తారపై కోపం పెంచుకుంది. రాజశేఖర్తో పరిచయాన్ని కొనసాగిస్తూనే పథకం ప్రకారం అతడి ద్వారానే తార ఫోన్ నెంబర్ సంపాదించింది.
ఫోన్ సంభాషణల ద్వారా తారతో పరిచయం పెంచుకున్న హరిత ఆరు నెలలుగా తరుచూ తార ఇంటికి వస్తూపోతూ ఉండేది. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం కూడా విడివోస్ కాలనీలోని తార ఇంటికి వచ్చింది. మాట్లాడుతూ తారను డాబాపైకి తీసుకెళ్లింది. అక్కడ వారిద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు. సాయంత్రం ఐదుగంటల సమయంలో ముందస్తు వ్యూహం ప్రకారం తారను మాటల్లో దించిన హరిత.. తారను కళ్లుమూసుకోమంది.
హరిత మాటలను నమ్మిన తార కళ్లు మూసుకుంది. శుభవార్త చెబుతానని స్వీటు అందజేస్తున్నట్లు నటించి నోట్లో కాగితాలు పెట్టింది. తర్వాత తన వెంట తెచ్చుకున్న బ్లేడుతో తార గొంతు కోసి అక్కడ నుంచి వెళ్లిపోయింది. గొంతుకు తీవ్ర గాయమైన తార కేకలు వేస్తూ మేడపై నుంచి కిందకు వచ్చి తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని వివరించింది. దీంతో వారు తమ కుమార్తెను హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చారు.
డాబాపై వీరిద్దరు మాట్లాడుతుండగా చూసిన స్థానికులు నిందితురాలిని గుర్తించారు. పోలీసులతో పాటు వారు కూడా బాలిక కోసం వెతుకుతుండగా వైరా రోడ్లోని బస్టాప్లో ఆటో కోసం నిరీక్షిస్తూ బాలిక వారి కంటపడింది. వెంటనే టూ టౌన్ ఎస్సైసత్యనారాయణ ఆ బాలికను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.