వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రత్నగిరిలో నదిలో పడిన బస్సు: 37 మంది మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

At least 37 killed as bus plunges into river in Maharashtra
ముంబయి/హైదరాబాద్: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని రత్నగిరి జిల్లాలోని ఖేడ్ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఓ బస్సు అదుపు తప్పి వంతెన పై నుండి నదిలోకి బోల్తా పడింది. ఈ ఘటనలో దాదాపు ముప్పయ్యేడు మంది వరకు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మరో ఇరవై మంది వరకు గాయపడ్డారు. ఇందులో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు చికిత్స కోసం తరలించారు.

గోవా నుండి ముంబయికి వెళ్తున్న ఈ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదానికి గురైనట్లుగా చెబుతున్నారు. గోవా - ముంబయి రోడ్డు హైవే. వేగంగా వెళ్తున్న బస్సు అదుపు తప్పి నదిలో పడింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

తూర్పు గోదావరి జిల్లాలో అగ్ని ప్రమాదం

తూర్పు గోదావరి జిల్లా గంగవరం మండలం వేములోవలో ఈ రోజు ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. ఓ పూరింటిలో మంటలు చెలరేగి భారీగా వ్యాపించాయి. దీంతో సమీపంలోని ఇరవై పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో రూ.20 లక్షల ఆస్తి నష్టం జరిగిందని భావిస్తున్నారు.

విశాఖలో లారీలు ఢీ

విశాఖపట్నం జిల్లాలోని పాయకరావుపేట మండలంలో రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి.

English summary
At least 37 people were killed and over 15 injured when a Mumbai-bound private luxury bus plunged into a river in Ratnagiri district of coastal Konkan area on Tuesday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X