నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పార్టీలో చిచ్చు: నిజామాబాద్ జిల్లా కన్వీనర్ రిజైన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YSR Congress
నిజామాబాద్: వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిజామాబాద్ జిల్లా శాఖలో విభేదాలు పొడసూపాయి. తీవ్ర అసంతృప్తికి గురైన జిల్లా కన్వీనర్ వెంకటరమణారెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన హైదరాబాదులోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేత సుబ్బారెడ్డి అందజేశారు.

వెంకరమణారెడ్డి బాటలో నాలుగు నియోజకవర్గ నేతలు నడుస్తారని అంటున్నారు. నేడో, రేపో వారంతా మూకుమ్మడి రాజీనామాలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. కార్యకర్తలకు, కష్టపడే నాయకులకు పార్టీలో అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు.

నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ పెద్దనేత డబ్బు దండుకుని నియోజవర్గ ఓ ఆర్డినేటర్లను నియమించారని మండిపడ్డారు. కష్టపడే వారిని పక్కనబెట్టి పార్టీలో ఇటీవల చేరిన ధనవంతులకు టికెట్లు ఇస్తున్నారని దుయ్యబట్టారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో సమన్వయకర్తల నియామకం పలు జిల్లాల్లో చిచ్చు రేపుతోంది. ప్రస్తుతం నియమించిన సమన్వయకర్తలకే వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్లు లభిస్తాయనే అభిప్రాయం బలంగా ఉంది. దీంతో సమన్వయకర్తల పదవులు లభించని నేతలు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. అదే సమయంలో వివిధ నియోజకవర్గాల్లో వర్గ విభేదాలు చోటు చేసుకుంటున్నాయి.

English summary
In an unusual development in YS Jagan's YSR Congress party Nizamabad district party convener Venkataramana Reddy resigned for the party membership opposing the appointments of co-ordinators.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X