దొంగ.. నువ్వే, ఎవడ్రా నువ్వు: ముత్యం వర్సెస్ ఫారూక్

ఆరు నెలల తర్వాత మెదక్ జిల్లా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. దీనికి జిల్లా ఇన్చార్జి మంత్రి డికె అరుణ అధ్యక్షత వహించగా, జిల్లాకు చెందిన డాక్టర్ గీతా రెడ్డి కూడా హాజరయ్యారు. సమావేశంలో పారిశుధ్యంపై సమీక్ష జరుగుతుండగా తన నియోజకవర్గంలో తనకు సమాచారం లేకుండా రూ.5 లక్షలు ఎలా కేటాయించారని అధికారులను ప్రశ్నించారు. అది ముత్యంరెడ్డి, ఫారూఖ్ హుస్సేన్ల మధ్య వాగ్వాదానికి దారితీసింది.
నువ్వు దొంగవంటే నువ్వు దొంగవు అంటూ ఇద్దరూ తిట్టుకున్నారు. దాంతో ఎమ్మెల్యేలు నర్సా రెడ్డి, కిష్టా రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి డికె అరుణ కల్పించుకుని వారిని శాంతింపజేశారు. ఈ గొడవ అంతటితో అయిపోలేదు. ఉపాధి హామీ గురించి చర్చ జరుగుతుండగా ముత్యం రెడ్డి తాను తన నియోజకవర్గ నిధుల నుంచి డ్వాక్రా భవనాల నిర్మాణానికి నిధులు ఇచ్చానని కానీ, ఎన్ని బావుల పూడికలు తీశారో అధికారులు లెక్కలు ఇవ్వలేదని మండిపడ్డారు.
ఈ అంశంపై చర్చ జరుగుతుండగా ఎమ్మెల్సీ ఫారూఖ్ కల్పించుకుని ఆడవారిని గౌరవించేలా మాట్లాడాలని ముత్యం రెడ్డికి సూచించారు. దాంతో మరోసారి దూషణలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా వారు తిట్టుకున్నారు. తర్వాత ఫారూక్ మాట్లాడుతుండగా ముత్యం రెడ్డి అడ్డుపడ్డారు. నువ్వెవడివి నా నియోజకవర్గం గురించి మాట్లాడేందుకని ముత్యం రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ కూడా అదేస్థాయిలో మండిపడ్డారు. ఇతరులు నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications