వైయస్పై దాడి సాగిస్తే జగన్ పార్టీలోకి: సుధీర్ రెడ్డి

వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి ఇంకా ఎవరెవరు వెళ్తారని అమర్కాలే సుధీర్ రెడ్డిని ప్రశ్నించారు. వైయస్ రాజశేఖర రెడ్డిని విమర్శించేవారిని కట్టడి చేయకపోతే పార్టీని వీడే అవకాశముంటుందని ఆయన జవాబిచ్చారు.. ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చేవారికి టికెట్టు ఇవ్వొద్దని ఆయన కోరారు. వైఎస్ను విమర్శిస్తున్న వారిని అదుపులో పెట్టకపోతే కాంగ్రెస్ పార్టీకే నష్టమని అమర్కాలేకు సుధీర్ రెడ్డి చెప్పారు.
గాంధీభవన్లో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలతో రాహుల్ దూత అమర్కాలే సోమవారం ఉదయం సమావేశమయ్యారు. మంత్రి ప్రసాద్కుమార్ ఈ సమావేశానికి హాజరయ్యారు. చేవెళ్ల, మల్కాజగిరి స్థానాలపై వారు చర్చిస్తున్నట్లు సమాచారం.
తెలంగాణ సమస్యను తేల్చకపోతే పార్టీ పరిస్థితి బాగుండదని కాంగ్రెసు శానససభ్యుడు రాజేందర్ అమర్ కాలేతో చెప్పారు. తెలంగాణ సమస్యను త్వరగా తేల్చాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెసురకు తిరుగు ఉండదని, ఎవరిని అభ్యర్థులుగా దించినా గెలుస్తారని ఎమ్మెల్సీ యాదవ రెడ్డి చెప్పారు.
హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన కుమారుడు కార్తిక్ రెడ్డితో కలిసి అమర్ కాలేతో సమావేశమయ్యారు. కాగా, జైపాల్ రెడ్డిపై చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెసు కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. విజయం సాధించిన తర్వాత జైపాల్ రెడ్డి చేవెళ్లకు రాలేదని వారు చెప్పారు. ఈసారి జైపాల్ రెడ్డికి టికెట్ ఇవ్వకూడదని వారు కోరారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications