సబిత రాజీనామా చేస్తానన్నారు: బొత్స, విహెచ్ ఫైర్
పూర్తి వివరాల అనంతరం ఆలోచించుదామని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆరోపణలు రాకుండా ఉండేందుకు కనీసం తన శాఖనైనా మార్చాలని ఆమె కోరారు. అందుకు కూడా కిరణ్ నో చెప్పారట. కాగా, సబిత రాజీనామా అంశంపై పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... సబిత రాజీనామా చేయాలని భావించారని, తన పేరు ఛార్జీషీటులో ఉన్నందున మంత్రి పదవిలో కొనసాగడం భావ్యం కాదని ఆమె చెప్పారన్నారు. అయితే, అన్ని పరిణామాలను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోవచ్చునని ముఖ్యమంత్రితో పాటు అందరు ఆమెకు నచ్చజెప్పారన్నారు.
వేరు వేరు న్యాయమా?
జగన్ అక్రమాస్తుల కేసు చార్జిషీటులో పేరు చేర్చినందున సబిత వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావు డిమాండ్ చేశారు. సబిత మంత్రి పదవిపై ఓసారి ఆలోచించుకోవాలన్నారు. ఓ కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తి హోంమంత్రిగా ఉంటే ప్రజల మదిలో కొత్తరకమైన ప్రశ్నలు తలెత్తే అవకాశముందన్నారు. రాజీనామా చేయకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. అవినీతికి కాంగ్రెస్ పార్టీయే వత్తాసు పలుకుతుందని ప్రజలు భావించే ప్రమాదముందని.. చార్జిషీట్లలో పేరున్న మంత్రులందర్నీ పదవిలోంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
సబిత రాజీనామా చేయకపోతే ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని ఆమెను కేబినెట్ నుంచి తొలగించాలని మాజీ మంత్రి శంకర్ రావు డిమాండ్ చేశారు. మంత్రి మోపిదేవి వెంకటరమణకు ఒక న్యాయం, సబితకు మరో న్యాయం ఉండకూడదని అన్నారు. సబితతో పాటు ధర్మానను కూడా కేబినెట్ నుంచి తొలగించాలని లేకపోతే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం జరుగుతుందని పేర్కొన్నారు.