దారుణం: యువతిని హత్య చేసి ముఖం కాల్చేశారు
బుధ అర్ధరాత్రి ఒంటిగంట నుంచి 2 గంటల సమయంలో ఇద్దరు పోలీసులు గండిపేట ఏరియాలో చౌరస్తా ప్రాంతం శివారున రోడ్డుపై గస్తీలో భాగంగా వెళ్తుండగా మంటలను గుర్తించారు. వారు అక్కడికి వెళ్లి చూడగా ఓ యువతి ముఖం కాలుతూ ఉంది. మంటలు అర్పారు. అయితే అప్పటికే ఆమె మరణించినట్లు వారు గుర్తించారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు.
ఎక్కడో హత్యచేసి ఇక్కడకు తీసుకొచ్చి ఆమెను గుర్తుపట్టకుండా ఉండేందుకు ముఖాన్ని పెట్రోల్ పోసి తగలెట్టారని పోలీసులు చెబుతున్నారు. ఆమె ధరించిన దుస్తుల ప్రకారం నయా సంపన్నవర్గానికి చెందిన అమ్మాయి అయి ఉంటుందని భావిస్తున్నారు.
యువతి వయస్సు 20 నుంచి 25 ఏళ్ల లోపు ఉంటుందని, ఆమె తలవెంట్రుకలు పూర్తిగా కాలిపోవడంతో ఎప్పుడో తగిలిన దెబ్బల గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆమెకు సంబంధించిన వివరాలు అందితే గానీ ఈ కేసు మిస్టరీ చేధించలేమని పోలీసులు అంటున్నారు.