జగన్ కేసులో జప్తుపై తీర్పు రిజర్వ్: బీవీకి బెయిల్
చెప్పదలుచుకున్న విషయాలు ఏమైనా ఉంటే లిఖితపూర్వకంగా సమర్పించాలని న్యాయప్రాధికార సంస్థ ఆదేశించింది. చెప్పాల్సిన అంశాలను ఈ నెల 30వ తేదీలోగా లిఖిత పూర్వకంగా సమర్పించాలని సంస్థ రాంకీ, జగతి సంస్థలను కూడా ఆదేశించింది.
కర్ణాటక మాజీ మంత్రి బీవి శ్రీనివాస రెడ్డికి కోర్టు బుధవారం మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు ఎస్కార్టుతో కూడిన బెయిల్ను శ్రీనివాస రెడ్డికి మంజూరు చేసింది. బళ్లారిలో ఉన్నతన అమ్మమ్మను చూడడానికి అనుమతించాలని బీవీ శ్రీనివాస రెడ్డి కోర్టును కోరారు. శ్రీనివాసరెడ్డి కదలికలపై నిఘా పెట్టాలని కోర్టు సిబిఐకి సూచించింది.
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) కేసులో గాలి జనార్దన్ రెడ్డితో పాటు శ్రీనివాస రెడ్డిని కూడా సిబిఐ అరెస్టు చేసింది. అప్పటి నుంచి శ్రీనివాసరెడ్డి హైదరాబాదులోని చంచల్గుడా జైలులో ఉన్నారు. ఓఎంసిలోఆయన డైరెక్టర్గా ఉన్నారు. గాలి జనార్దన్ రెడ్డికి ఆయన సమీప బంధువు కూడా.