సుప్రీంలో సంజయ్ దత్కి స్వల్ప ఊరట: ఆర్నెల్లకు నో
అయితే, సంజయ్ కోరినట్లుగా ఆరు నెలలు కాకుండా నాలుగు వారాల గడువును ఇచ్చింది. ఆరు నెలలు గడువు ఇవ్వడం కుదరదని, నాలుగు వారాల గడువు ఇస్తున్నామని, ఈ లోగా సినిమాలు ఏమైనా ఉంటే పూర్తి చేసుకోవాలని సుప్రీం సంజయ్ దత్కి సూచించింది.
కాగా, 1993 నాటి పేలుళ్ల కేసులో జైలు శిక్షను అనుభవించేందుకు తాను లొంగిపోవాల్సిన గడువును ఆరు నెలలకు పెంచాలని ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ సోమవారం అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సంజయ్ దత్ దరఖాస్తు విచారణ వచ్చింది. ఈ రోజు కోర్టు గడువును పెంచుతూ అనుమతి ఇచ్చింది.
1993 నాటి ముంబై బాంబు పేలుళ్ల కేసులో సంజయ్ దత్కు సుప్రీం కోర్టు ఐదేళ్ల జైలు శిక్షను అనుభవించారు. సుప్రీం మార్చి 21న తీర్పు ఇచ్చింది. నాలుగు వారాల్లోగా సంజయ్ శిక్ష అనుభవించేందుకు కోర్టులో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశం మేరకు గురువారం, ఏప్రిల్ 18లోగా సంజయ్ దత్ లొంగిపోవాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో సంజయ్ దత్ రెండు రోజుల క్రితం సుప్రీంను గడువు పెంచాలంటూ ఆశ్రయించారు. నాటి బాంబు పేలుళ్ల కేసులో సంజయ్ దత్ అక్రమాయుధాలు కలిగి ఉన్నారనే కేసు కింద శిక్షను అనుభవించాల్సి ఉంది. అతనికి బాంబే కోర్టు ఆరేళ్ల శిక్షను విధించింది. సుప్రీం దానిని ఐదేళ్లకు తగ్గించింది.
సంవత్సరంన్నర సంజయ్ శిక్షను అనుభవించినందున మరో మూడున్నరేళ్లు అనుభవించాల్సి ఉంది. అయితే, లొంగుబాటుకు సంజయ్ ఆరు నెలలు గడువు కోరగా సుప్రీం కోర్టు మరో నాలుగు వారాలు ఇవ్వడం సంజయ్కి స్వల్ప ఊరట. ఈ సమయంలో ఆయన తన సినిమాలను పూర్తి చేసుకోవాలని చూస్తున్నారు.