నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముంబైలో తేలిన కామారెడ్డి అమ్మాయి, మహిళ పని

By Pratap
|
Google Oneindia TeluguNews

Kamareddy girl appears in Mumbai
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ఇంటర్ విద్యార్థిని అదృశ్యం కథ సుఖాంతమైంది. ముంబై పోలీసుల సహాయంతో బయటపడింది. కామారెడ్డిలోని విద్యానగర్ కాలనీకి చెందిన శ్రీనివాస్ కుమార్తె కీర్తన (17) ఆదివారం అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి కామారెడ్డికి తిరిగొస్తూ మార్గమధ్యలో అదృశ్యమైంది. దీంతో కలవరపడిన పోలీసులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అదలా వుంటే, మంగళవారం ఉదయం ముంబైలోని చర్చిగేటు రైల్వేస్టేషన్‌లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న కీర్తనను అక్కడి సీఎస్‌టీ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో తనది కామారెడ్డి అని, గుర్తు తెలియని మహిళ ఇక్కడికి తీసుకొచ్చిందని తెలిపింది. ఆమె వద్ద నుంచి తప్పించుకుని రైల్వేస్టేషన్‌కు వచ్చినట్టు రోదిస్తూ చెప్పింది.

చివరకు కీర్తన వద్ద సెల్ నెంబర్లు తీసుకున్న చర్చిగేట్ పోలీసులు, ఆమె కుటుంబసభ్యులతో పాటు కామారెడ్డి పోలీసులను సంప్రదించారు. దీంతో ముంబైలో ఉన్న కీర్తనను తీసుకొచ్చేందుకు మంగళవారం సాయంత్రం పోలీసులతో పాటు కుటుంబసభ్యులు బయలుదేరి వెళ్లారు.

కాగా, కీర్తనను ముంబై పోలీసులు కీర్తనను ఓ స్వచ్ఛంద సంస్థ ఆధీనంలో ఉంచినట్టు తెలిసింది. కీర్తన అదృశ్యం సంఘటన స్థానికంగా తీవ్ర కలవరం సృష్టించింది. తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

English summary

 A girl from Kamareddy of Nizamabad district in Andhra Pradesh appeared in Mumbai. She has been rescued by Mumbai police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X