ఢిల్లీ, కాశ్మీర్లో భూప్రకంపనలు: హిందూకుష్లో కేంద్రం
ఒక్కసారిగా ప్రకంపనలు చెలరేగడంతో ఢిల్లీలో, కాశ్మీర్లో ప్రజలు భయానికి గురై ఇళ్ల నుండి బయటకు వచ్చారు. హిందూకుష్ పర్వత ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
కాగా, దేశ రాజధాని న్యూఢిల్లీలో వారం రోజుల క్రితం(గత మంగళవారం) కూడా భూమి స్వల్పంగా కంపించిన విషయం తెలిసిందే. భూమి ఒక్కసారిగా కంపించడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు భయానికి గురై ఇళ్ల నుండి, అపార్టుమెంటుల నుండి, కార్యాలయ నుండి బయటకు వచ్చారు.
మధ్య ఢిల్లీ, తూర్పు ఢిల్లీ, ఉత్తర ఢిల్లీ ప్రాంతాల్లో భూమి కంపించింది. నోయిడాలోను భూమి కంపించింది. దాదాపు పది నుండి ఇరవై సెకన్ల మధ్య ఆయా ప్రాంతాల్లో భూమి కంపించినట్లుగా చెబుతున్నారు. రిక్టర్ స్కేలు పైన ఇది 5.6గా ఉంది. భూమి ఒక్కసారిగా కంపించడంతో భవంతులు పడిపోతాయేమోనని ప్రజలు ఆందోళనకు గురయ్యారు.
ఢిల్లీతో పాటు ఉత్తర భారత దేశంలోని నోయిడా, ఛండీగఢ్, అహ్మదాబాద్ తదితర ప్రాంతాల్లోను భూమి కంపించింది. అప్పుడు పాకిస్తాన్, ఇరాన్ దేశాల్లోను భూకంపం వచ్చింది. ఈ దేశాల్లో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలు పైన 7.8గా ఉంది. భూకంప కేంద్రం పాకిస్తాన్ - ఇరాన్ సరిహద్దు ప్రాంతంలో ఉన్నట్లుగా గుర్తించారు.
ఇరాన్ లోని ఖాష్లో పదిహేను కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇరాన్, గల్ఫ్ దేశాలు, పాకిస్తాన్, భారత్లపై భూకంప ప్రభావం పడింది. ఇరాన్ను ఈ భారీ భూకంపం వణికించింది. ఖాష్ పట్టణంలో దాదాపు నలబై మంది వరకు మృతి చెందారు. వేలాది మంది గాయపడ్డారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. పలు భవంతులు కుప్పకూలాయి. సహాయక చర్యలు చేపడుతున్నారు. భూకంపం కారణంగా పాక్లో ఐదుగురు మృతి చెందారు.