హరి, ఎన్టీఆర్ డుమ్మా: కళ్యాణ్రామ్ కూడా ఆగాడా?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా.. మీకోసం పాదయాత్ర ముగింపు సభకు పార్టీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ హాజరు కాకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విశాఖపట్నంలో బహిరంగ సభకు చేసిన ఏర్పాట్లలో నారా లోకేష్ ఫ్లెక్సీలను, కటౌట్లను ఏర్పాటు చేయడం హరికృష్ణకు ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది. మరోవైపు, తమ బొమ్మలను వాడకపోవడంపై కూడా ఆయన కినుక వహించినట్లు చెబుతున్నారు. దీంతో ఆయన శనివారం సాయంత్రం జరిగిన బహిరంగ సభకు హాజరు కాలేదు.
చంద్రబాబు ముగింపు సభకు జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా రాకపోయినా హరికృష్ణ వెళ్తారని శుక్రవారం సాయంత్రం వరకు ప్రచారం సాగింది. అయితే, హరికృష్ణ హాజరు కాకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం హాజరు కాకూడదని మొదటే అనుకున్నట్లు చెబుతున్నారు. హరికృష్ణ కుటుంబ సభ్యులంతా ఈ సభకు దూరంగా ఉన్నారు. తనకు ఆరోగ్యం సహకరించడం లేదని హరికృష్ణ తనను సంప్రదించిన తెలుగుదేసం పార్టీ నాయకులతో చెప్పినట్లు సమాచారం.

చంద్రబాబు సభకు హాజరు కావడానికి మొగ్గు చూపిన హీరో కళ్యాణ్ రామ్ కూడా ఆగిపోయినట్లు తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ను హరికృష్ణ నిలువరించినట్లు చెబుతున్నారు. ఇంతకు ముందు కళ్యాణ్ రామ్ విశాఖపట్నం జిల్లా వెళ్లి చంద్రబాబును పరామర్శించారు. దీంతో కళ్యాణ్ రామ్ చంద్రబాబుకు మద్దతు ఇస్తున్నట్లు, తప్పకుండా సభకు హాజరు కానున్నట్లు ప్రచారం సాగింది.
ఇక, చంద్రబాబు బహిరంగ సభలో పాల్గొనేందుకు నందమూరి హీరోలు బాలకృష్ణ, తారకరత్న విశాఖపట్నం చేరుకున్నారు. సభలో పాల్గొన్నారు. బాలకృష్ణకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, నారా లోకేష్ చంద్రబాబుతో పాటు సభలో పాల్గొన్నారు. మొత్తం మీద, తెలుగుదేశం పార్టీలో అంతర్గత పోరు తీవ్రమైనట్లే కనిపిస్తోంది.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications