చంద్రబాబూ! ఏం మార్చేస్తావో చెప్పు?: శైలజానాథ్
అధికారంలోకి వస్తే ఇప్పటి సంక్షేమ పథకాలను చంద్రబాబు రద్దు చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు. ప్రస్తుతం రాష్ట్రం బాగానే ఉందని, బాబు వచ్చి కొత్త సమస్యలు తీసుకు వస్తారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మధ్య విభేదాలు లేవని, ఏమైనా ఉన్నా పరిష్కరించుకుంటారన్నారు.
బొగ్గు కుంభకోణంలో బిజెపికీ భాగస్వామ్యం: ఏచూరి
బొగ్గు కుంభకోణంలో భారతీయ జనతా పార్టీకి కూడా భాగస్వామ్యం ఉందని సిపిఎం సీనియర్ పోలిట్ బ్యూరో సభ్యులు సీతారం ఏచూరి ఆరోపించారు. కాంగ్రెసు, బిజెపిలు ఈ అంశంపై పార్లమెంటులో చర్చకు రాకుండా అడ్డుపడుతున్నాయని విమర్శించారు. కేంద్రంలోని మైనార్టీ ప్రభుత్వం ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చునన్నారు.
ఎన్నికలలో సంస్కరణలు తేవాల్సిన అవసరముందన్నారు. ములాయం సింగ్ యాదవ్, మాయావతిల వల్లే కేంద్రంలో యూపిఏ ప్రభుత్వం నిలబడిందన్నారు. ఎప్పుడైనా కూలవచ్చన్నారు. 2జి కుంభకోణాన్ని పూర్తిగా రాజా పైకి నెట్టి వేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.