జగన్పై టిడిపి రివర్స్ గేమ్!: షర్మిల యాత్రలో కలకలం

ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టు ఉంది. ఈ జిల్లాలో జలగం వెంకట్రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మచ్చా శ్రీనివాస్ తదితరులు వైయస్సార్ కాంగ్రెసులో ఉన్నారు. ఇటీవల పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించింది.
ఈ సందర్భంగా కరపత్రాల కలకలం చెలరేగింది. పార్టీలో కీలకంగా ఉన్న జలగం వెంకట్రావును దెబ్బ తీసేందుకు తెలుగుదేశం పార్టీ నేత తుమ్మల నాగేశ్వర రావు వ్యూహాత్మకంగా తనకు అనుకూలురుగా ఉండే మచ్చా, పొంగులేటిలను వైయస్సార్ కాంగ్రెసులోకి పంపించారనే కరపత్రాలు కనిపించాయి. ఇది జిల్లాలో ప్రధానంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో హాట్ టాపిక్గా మారింది.
జిల్లాలో జగన్ పార్టీని, జలగంను దెబ్బతీసేందుకే తుమ్మల వారిని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి ప్రవేశించారా? అనే చర్చ సాగుతోంది. అయితే, ఈ ఆరోపణలను సదరు నేతలు మాత్రం ఖండిస్తున్నారు. తమను ఎదుర్కోలేకే ఇలాంటి చీఫ్ ట్రిక్స్కు తెరలేపుతున్నారని, తాము జగన్ నాయకత్వంలోనే పని చేస్తామని వారు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications