కెసిఆర్ నోటికి మోరీకి తేడా లేదు: జగ్గారెడ్డి నిప్పులు

తెలంగాణ ఆస్తులను కాపాడిన ముఖ్యమంత్రిని అభినందించాల్సింది పోయి విమర్శిస్తారా అని మండిపడ్డారు. బయ్యారంలో స్టీల్ ప్లాంటును ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారని, ఆయన మాటలను నమ్మకుంటే ఎలా అన్నారు. తెలంగాణ సెంటిమెంటును వాడుకొని ప్రజలను రెచ్చగొట్టి వారిని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు కెసిఆర్ చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఆయన రాజకీయ పబ్బం గడుపుకునేందుకే బయ్యారం గనులపై అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి సోమవారం నాడు మెదక్ జిల్లా సభలో కేవలం జిల్లా గురించి మాట్లాడలేదని, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారన్నారు. బయ్యారం ఆస్తులను కాపాడినందుకు ముఖ్యమంత్రిని అభినందించాలన్నారు. బయ్యారం గనులకు మెదక్కు సంబంధం లేదన్నారు.
అలా కాకుండా భూకంపం సృష్టిస్తామనడం ఎంత వరకు సమంజసమన్నారు. కెసిఆర్ ఎప్పుడైనా తెలంగాణ ప్రజల గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు. ఎల్లుండి తెలంగాణ బందు ప్రజల కోసం కాదని వారి రాజకీయ లబ్ధి కోసమే అన్నారు. బందుకు తాము మద్దతిచ్చే ప్రసక్తే లేదన్నారు. బందును తాము వ్యతిరేకిస్తున్నామని, మెదక్ జిల్లా ప్రజలు సహకరించరన్నారు. బందును సమర్థవతంగా ఎదుర్కోంటామన్నారు. కెసిఆర్ నోటికి, మోరీకి ఏమాత్రం తేడా లేదన్నారు. సిఎల్పీలో వైయస్ ఫోటో తొలగింపుపై చర్చిస్తామన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications