వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సురేఖ పార్టీలోనే ఉన్నారు, బాబుకు భయం: భూమన

By Pratap
|
Google Oneindia TeluguNews

Bhumana Karunakar Reddy
హైదరాబాద్: వరంగల్ జిల్లాకు చెందిన కొండా సురేఖ తమ పార్టీలో ఉన్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శానససభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. పార్లమెంటు ఆవరణలో ఎన్టీ రామారావు విగ్రహావిష్కరణను ఆహ్వానిస్తున్నామని, వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహం కూడా పెట్టాలని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

సిబిఐని విమర్శించకపోవడమే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెసుతో మిలాఖత్ అయ్యారని చెప్పడానికి నిదర్శనమని ఆయన అన్నారు. సిబిఐ అంటే చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ అని ఆయన వ్యాఖ్యానించారు. తనకు గిట్టనివారిపై కాంగ్రెసు సిబిఐని ఉసిగొల్పుతోందని ఆయన అన్నారు.

సిబిఐకి స్వతంత్ర ప్రతిపత్తి లేదని తేటతెల్లమైందని ఆయన అన్నారు. సిబిఐ ప్రభుత్వం చెప్పినట్లు చేస్తోందని ఆయన విమర్శించారు. సిబిఐ నిర్లజ్జగా ప్రభుత్వం కొమ్ము కాస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తొత్తుగా సిబిఐ వ్యవహరిస్తుంటే చంద్రబాబు మాట్లాడడం లేదని ఆయన అన్నారు.

తన అవినీతి బయటపడతుందనే భయంతోనే చంద్రబాబు సిబిఐపై మాట్లాడడం లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెసుకు వ్యతిరేకంగా వ్యవహరించినందుకే తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను వేధిస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.

English summary
The YSR Congress party MLA Bhumana Karunakar Reddy said that former MP from Warangal district, Konda Surekha is in his party. He opposed the attitude of CBI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X