తెలుగు ప్రజల కీలక తీర్పు: కర్నాటక ఫలితాలపై బొత్స
భారతీయ జనతా పార్టీ అవినీతికి వ్యతిరేకంగా ఆ రాష్ట్ర ప్రజలు ఓటేశారన్నారు. అవినీతిని, దోపిడీని ప్రజలు ఏమాత్రం సహించరన్నారు. ప్రజలు అవినీతిని సహించరనడానికి కర్నాటక ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. శ్రీరాములు లాంటి ఒకరిద్దరు గెలిచినంత మాత్రాన అవినీతికి ప్రజలు పట్టం కట్టినట్లు కాదన్నారు. రాష్ట్రంలో నేతలంతా ఐక్యంగానే ఉన్నారన్నారు. పథకాల గురించి ఇవాళ కాకుంటే రేపు తెలుసుకుంటామన్నారు.
కర్నాటకలో కాంగ్రెసు పార్టీ గెలుపొందడానికి తమ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీయే కారణమని రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారన్నారు. ఇది దేశవ్యాప్తంగా ముందు ముందు కొనసాగుతుందని చెప్పారు.
టిడిపి గెలుస్తుంది.. కళా
కర్నాటక ఫలితాలు ఏమాత్రం ఆశ్చర్యం కలిగించలేదని టిడిపి నేత కళా వెంకట్రావు అన్నారు. అవినీతివల్లే బిజెపి ఓడిపోయిందన్నారు. ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లనే కాంగ్రెసును గెలిపించారన్నారు. ఇక రాష్ట్రంలో కూడా అవినీతే ప్రధాన అజెండా అన్నారు. రాష్ట్రంలో టిడిపిని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆశ్చర్యం కలిగించలేదు, , అవినీతవల్లే,ప్రత్యామ్నాయంలేక కాంగ్రసు, ఇక రా,ట్రమంలో అవినీతి ప్రధాన అజెండ, రాష్ట్రంలో, టిడిపిని గెలిపిస్తారు,