కిరణ్కు ఢిల్లీ రాజీనామాల సెగ: విహెచ్, శంకరన్న ఫైర్

అవినీతి ఆరోపణలు ఎదుర్కునేవారిని తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహించబోరని, కేంద్రంలో ఇద్దరు మంత్రులతో రాజీనామాలు చేయించారని, రాష్ట్రంలో కూడా కళంకిత మంత్రులను తొలగించడం మంచిదని హనుమంతరావు అన్నారు. సోనియా మాదిరిగానే కళంకిత మంత్రులపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు.
కళంకిత మంత్రులు రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళ్తే మంచిదని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. అవినీతిని నిర్మూలించడం వల్లనే కర్ణాటకలో కాంగ్రెసుకు ప్రజలు పట్టం కట్టారని ఆయన అన్నారు. అవినీతిని సోనియా గాంధీ సహించబోరని ఆయన చెప్పారు.
వైయస్ జగన్ అస్తుల కేసులో వివాదాస్పద జీవోలు జారీ చేసిన మంత్రులు రాజీనామా చేయాల్సిందేనని మాజీ మంత్రి శంకరరావు అన్నారు. వారు రాజీనామా చేయకపోతే ముఖ్యమంత్రి వారిని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై కూడా ఆరోపణలున్నాయని ఆయన అన్నారు. కళంకిత మంత్రులను మంత్రివర్గంలో ఎలా కొనసాగనిస్తారని ఆయన అడిగారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications