16మంది ఎమ్మెల్యేలు, 6గురు పొలిట్ బ్యూరో సభ్యులు!
పొలిట్ బ్యూరో నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఉప్పులేటి కల్పన, ఎంవి మైసూరా రెడ్డి, దాడి వీరభద్ర రావు, నాగం జనార్ధన్ రెడ్డి, కడియం శ్రీహరిలు పార్టీని వీడారు. ఈ మూడేళ్లలో ఆరుగురు పొలిట్ బ్యూరో సభ్యులు పార్టీకి గుడ్ బై చెప్పారు.
గుడ్ బై చెప్పిన ఎమ్మెల్యేల్లో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, బాలనాగి రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, సాయిరాజ్, కొడాలి నాని, తానేటి వనిత, చిన్నం రామకోటయ్య, చెన్నమనేని రమేష్, జోగు రామన్న, గంపా గోవర్ధన్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, గంగుల కమలాకర్, వేణుగోపాలచారి, నాగం జనార్ధన్ రెడ్డి, కొప్పల హరీశ్వర్ రెడ్డిలు ఉన్నారు.
పార్టీ సీనియర్ నేతలు సంకినేని వెంకటేశ్వర రావు, బొడ్డు భాస్కర రామారావు వంటి సీనియర్ నేతలు కూడా టిడిపికి గుడ్ బై చెప్పారు. పార్టీని వీడిన వారి దారిలోనే మరికొందరు సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు ఉన్నారనే ప్రచారం సాగుతోంది. పార్టీ వీడుతారనే ప్రచారం జరుగుతున్న పలువురు నేతలను ఇతర నేతలు బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారట.