వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీటింగ్‌కు కొణతాల డుమ్మా: ధిక్కార ఎమ్మెల్యేల ఫ్యాక్స్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Bajireddy Goverdhan Reddy - Konathala Ramakrishna
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సోమవారం ఉదయం రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమైంది. ఈ సమావేశానికి నెల్లూరు పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎంవి మైసూరా రెడ్డి, సోమయాజులు తదితరులు హాజరయ్యారు.

దాడి వీరభద్ర రావు రాకతో అసంతృప్తితో ఉన్న కొణతాల రామకృష్ణతో పాటు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గైర్హాజరయ్యారు. వ్యక్తిగత కారణాలతోనే వారు హాజరు కాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణం, తెలంగాణలో పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ పర్యటన తదితర అంశాలతో పాటు స్పీకర్ నోటీసులపై కూడా చర్చ జరుగుతున్నట్లుగా సమాచారం.

ధిక్కార ఎమ్మెల్యేలు ఫ్యాక్స్

అవిశ్వాస తీర్మానం సమయంలో పార్టీ విప్ ధిక్కరించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు వివరణ ఇవ్వాల్సి ఉంది. అవిశ్వాస తీర్మానం సమయంలో తొమ్మిది మంది కాంగ్రెసు ఎమ్మెల్యేలు, తొమ్మిది మంది టిడిపి ఎమ్మెల్యేలు విప్ ధిక్కరించారు.

ఈ రోజు కాంగ్రెసు, రేపు టిడిపి ఎమ్మెల్యేలు స్పీకర్‌కు వివరణ ఇవ్వనున్నారు. అయితే, తమపై వేటు వేయడం లేదా రాజీనామాలు ఆమోదించడం ఏదైనా చేయాలని తాము ఇప్పటికే స్పీకర్‌ను కోరామని, కాబట్టి ఈసారి నేరుగా హాజరుకాకుండా ఫ్యాక్స్ ద్వారా వివరణ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. పేర్ని నాని, ఆళ్ల నానిలు ఇప్పటికే ఫ్యాక్స్ పంపించారని సమాచారం. ధిక్కార ఎమ్మెల్యేల వివరణ నేపథ్యంలో ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి స్పీకర్‌ను కలిశారు.

English summary
YSR Congress Party senior leader Konathala Ramakrishna and Bajireddy Goverdhan Reddy were not attended to party political affairs meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X