కాంట్రాక్ట్ న్యూస్ రీడర్కు లైంగిక వేధింపులు, కేసు

అంతేకాకుండా తాను శాశ్వత ఉద్యోగిని అని ఆమెను బెదిరించే ప్రయత్నాలు చేశాడు. విధి నిర్వహణలో కూడా వేధిస్తూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. వేధింపులు ఎక్కువవుతుండటంతో విధులకు కూడా వెళ్లాలంటే ఆందోళన కలుగుతోందని ఆ యువతి ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో దారుణం
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణం తూర్పు మొగశాలలో ఐదో తరగతి చదువుతున్న బాలికపై.. 52 ఏళ్ల వ్యక్తి వారం రోజులుగా అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన మంగళవారం వెలుగు చూసింది. బాధితురాలు తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు.. పట్టణంలోని తూర్పుమొగశాలకు చెందిన బాలిక(10)కి మంగళవారం ఉదయం తీవ్ర జ్వరం సోకింది. బాలిక తల్లిదండ్రులు ఆందోళనకు గురైన ప్రయివేటు ఆసుపత్రికి తీసుకు వెళ్లారు.
పరీక్షించిన వైద్యుల బాలిక అత్యాచారానికి గురైన విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు. వారు బాలికను విచారించారు. పక్కింట్లో ఉన్న వివాహితుడు గోవింద్ వారం రోజులుగా తినుబండారాల ఆశ చూపి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడుతున్నట్లు బాలిక తెలిపింది. విషయం తెలుసుకున్న స్థానికులు నిందితుడిని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. స్థానిక పోలీసులు బాలికను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన












Click it and Unblock the Notifications