వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తన మార్క్ కోసం..: సోనియాతో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi and Kiran Kumar Reddy
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో శుక్రవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఆయన రాష్ట్ర వ్యవహారాలపై సోనియాతో చర్చిస్తున్నారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ కార్యవర్గం, కళంకిత మంత్రులు, మంత్రివర్గ విస్తరణ, గవర్నర్ కోటాలో శాసన మండలి అభ్యర్థులు తదితర అంశాలపై కిరణ్ అధినేత్రితో చర్చించే అవకాశాలు ఉన్నాయి.

కిరణ్ మంత్రి వర్గ విస్తరణ కోసం ఎప్పటి నుండే ప్రయత్నాలు చేస్తున్నారు. తన మార్క్ మంత్రివర్గం కోసం ఆయన చాలా రోజుల నుండి పట్టుబడుతున్నారు. అధిష్టానం పలు కారణాలు చెప్పి దానిని వాయిదా వేస్తూ వస్తోంది. ఇప్పుడు మరోసారి కిరణ్ విస్తరణపై ఆశలు పెట్టుకున్నారు. సోనియా అంగీకరిస్తే భారీగా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి.

పిసిసి కార్యవర్గం పైన కూడా ఆయన దృష్టి సారించినట్లుగా సమాచారం. అదే సమయంలో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ జోడు పదవుల అంశాన్ని ఆయన మేడం దృష్టికి తీసుకు వెళ్లనున్నారని అంటున్నారు. బొత్సను ఏదో ఒక పదవిలో ఉండమని ఆదేశిస్తే... ఖాళీ అయిన స్థానంలో తనకు అనుకూలురైన వారిని తీసుకోవాలని కిరణ్ భావిస్తున్నారట.

ముఖ్యమంత్రి గురువారం నుండి ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఆయన కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్‌తో రాత్రి భేటీ అయ్యారు. ఆయనతో పాటు బొత్స సత్యనారాయణ కూడా ఉన్నారు. ఈ రోజు రాత్రి ఆజాద్ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో రాత్రిలోగా విస్తరణ, కళంకిత మంత్రులు, పిసిసి కార్యవర్గం తదితర అంశాలు కొలిక్కి వస్తాయంటున్నారు.

English summary
CM Kiran Kumar Reddy has met AICC president Sonia Gandhi on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X