వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చుక్కెదురు: శ్రీశాంత్, చండిల పోలీసు కస్టడీకి కోర్టు నో

By Pratap
|
Google Oneindia TeluguNews

Sreesanth
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపియల్) స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో అరెస్టయిన క్రికెటర్లు శ్రీశాంత్, అజిత్ చండిలల పోలీసు కస్టడీకి ఢిల్లీ సాకేత్ కోర్టు తిరస్కరించింది. వారిద్దరిని మరో రెండు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టును అభ్యర్థించారు. పోలీసుల అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. శ్రీశాంత్, చండిలలకు కోర్టు జూన్ 4వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మరో రెండు రోజుల పాటు శ్రీశాంత్, చండిలలను తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టును కోరారు. అయితే, కోర్టుకు అందుకు అంగీకరించలేదు. ఈ నెల 16వ తేదీన అరెస్టయిన ఈ ఇద్దరు క్రికెటర్లు కూడా అప్పటి నుంచి పోలీసు కస్టడీలోనే ఉన్నారు మరో ఇద్దరు బుకీలను కూడా కోర్టు జూన్ 4వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీకి పంపుతూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

విదేశాల్లోని అండర్ వరల్డ్‌తో సంబంధాలున్న బుకీలతో ఏర్పాటు చేసుకుని కనీసం మూడు ఐపియల్ మ్యాచులను ఫిక్స్ చేశారనే ఆరోపణలపై ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఈ నెల 16వ తేదీన శ్రీశాంత్, అజిత్ చండిల, అంకిత్ చవాన్‌లను అరెస్టు చేశారు.

ముందే నిర్ణయించిన ప్రకారం పరుగులు ఇవ్వడానికి 60 లక్షలకు ఆ ముగ్గురు క్రికెటర్లు కూడా బుకీలతో ఒప్పందం కుదుర్చుకుని స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.

English summary
Arrested cricketers S Sreesanth and Ajit Chandila have been sent to judicial custody till June 4 for spot-fixing in the just-concluded sixth edition of the Indian Premier League (IPL) by a Delhi court on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X