కెసిఆర్ సక్సెసవుతున్నారు, సన్మానించాలి: జగ్గారెడ్డి

గత ముఖ్యమంత్రులు వైయస్ రాజశేఖర రెడ్డి, రోశయ్య, ప్రస్తుత సిఎం ముఖ్యమంత్రి వద్ద హరీష్ రావు నిధులు తీసుకు వెళ్లి సిద్దిపేటను అభివృద్ధి చేసుకోలేదా అని ప్రస్నించారు. అలాంటప్పుడు కిరణ్ నిధులు ఇవ్వనన్నారని ఎలా అంటారన్నారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడిన సందర్భం వేరన్నారు. కెసిఆర్ సంవత్సరంపాటు కేంద్రంలో మంత్రిగా ఉండి ఏం చేశారో చెప్పాలని మండిపడ్డారు.
ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. దొంగమాటలతో ప్రజలతో ఆడుకుంటున్నారన్నారు. కిరణ్ తెలంగాణ అభివృద్ధి కోసం భారీగా నిధులు ఇస్తున్నారని చెప్పారు. సకల జనుల సమ్మెను కెసిఆర్ అమ్ముకున్నారని టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర రావు వేరుగా అన్నారు. అప్పుడే మరో వారం రోజులు చేసి ఉంటే తెలంగాణ వచ్చేదన్నారు. టిడిపిని విమర్శిస్తున్న కెసిఆర్, రాహుల్ గాంధీ, సోనియా గాంధీలని ఎందుకు విమర్శించడం లేదని మండిపడ్డారు.
కెసిఆర్ పన్నెండేళ్లుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. కెసిఆర్కు తెలంగాణ కావాలా లేక రాజకీ పార్టీ కావాలా అని ప్రశ్నించారు. ఓట్లు, నోట్లు, సీట్ల కోసమే కెసిఆర్ తాపత్రయపడుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications