వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జగన్ కేసు: బ్రహ్మానందరెడ్డి బెయిల్ పిటిషన్ తిరస్కరణ
ఇదిలావుంటే, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రారెడ్డిలను జ్యూడీషియల్ కస్టడీకి తరలించాలంటూ సిబిఐ దాఖలు చేసిన మెమోపై విచారణను నాంపల్లి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఈనెల 19వ తేదీకి వాయిదా వేసింది.
వారిద్దరు కేసు దర్యాప్తును ప్రభావితం చేస్తారంటూ, మీడియా ఎదుట మాట్లాడిన తీరు అందుకు నిదర్శమని చెబుతూ సిబిఐ కోర్టుకు సిడిలను సమర్పించింది. ఈ సిడిల వివరాలను లిఖిత పూర్వకంగా అందించాలని కోర్టు సిబిఐని ఆదేశిస్తూ విచారణను 19వ తేదీకి వాయిదా వేసింది.
వాన్పిక్ కేసులో ధర్మాన ప్రసాదరావు, దాల్మియా సిమెంట్స్ కేసులో సబిత ఇంద్రారెడ్డిలు అక్రమాలకు పాల్పడ్డారని సిబిఐ కోర్టుకు దాఖలుచేసిన చార్జిషీటులో పేర్కొన్న సంగతి తెలిసిందే. వీరు బయట ఉంటే సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని సిబిఐ వాదిస్తోంది.
Comments
ys jagan ysr congress sabitha indra reddy dharmana prasad rao వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు బ్రహ్మానంద రెడ్డి సబితా ఇంద్రారెడ్డి ధర్మాన ప్రసాదరావు
English summary
CBI court has rejected IRS officer Brahmananda Reddy, accused in YSR Congress party president YS Jagan case, bail petition.
Story first published: Wednesday, June 12, 2013, 18:06 [IST]