వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కేసు: బ్రహ్మానందరెడ్డి బెయిల్ పిటిషన్ తిరస్కరణ

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో ప్రభుత్వ ఉన్నతాధికారి కెవి బ్రహ్మానంద రెడ్డి బెయిల్ పిటిషన్‌ను సిబిఐ కోర్టు బుధవారం తిరస్కరించింది. తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఆయనను సిబిఐ నిరుడు మే 15వ తేదీన అరెస్టు చేసింది. ప్రస్తుతం బ్రహ్మానంద రెడ్డి హైదరాబాదులోని చంచల్‌గుడా జైలులో ఉన్నారు.

ఇదిలావుంటే, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రారెడ్డిలను జ్యూడీషియల్ కస్టడీకి తరలించాలంటూ సిబిఐ దాఖలు చేసిన మెమోపై విచారణను నాంపల్లి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఈనెల 19వ తేదీకి వాయిదా వేసింది.

వారిద్దరు కేసు దర్యాప్తును ప్రభావితం చేస్తారంటూ, మీడియా ఎదుట మాట్లాడిన తీరు అందుకు నిదర్శమని చెబుతూ సిబిఐ కోర్టుకు సిడిలను సమర్పించింది. ఈ సిడిల వివరాలను లిఖిత పూర్వకంగా అందించాలని కోర్టు సిబిఐని ఆదేశిస్తూ విచారణను 19వ తేదీకి వాయిదా వేసింది.

వాన్‌పిక్ కేసులో ధర్మాన ప్రసాదరావు, దాల్మియా సిమెంట్స్ కేసులో సబిత ఇంద్రారెడ్డిలు అక్రమాలకు పాల్పడ్డారని సిబిఐ కోర్టుకు దాఖలుచేసిన చార్జిషీటులో పేర్కొన్న సంగతి తెలిసిందే. వీరు బయట ఉంటే సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని సిబిఐ వాదిస్తోంది.

English summary
CBI court has rejected IRS officer Brahmananda Reddy, accused in YSR Congress party president YS Jagan case, bail petition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X