ఎమ్మెమ్మెస్తో యువతికి వేధింపు, లీడర్పై కేసు
యువతిని వేధిస్తున్నందుకు పోలీసులు విశాళ్, వీరేంద్ర, లడ్డూ, సతీష్ల పైన కేసును నమోదు చేశారు. నిందితులు అమ్మాయిని ఎమ్మెస్ ద్వారా చిత్రీకరించినట్లుగా కూడా పోలీసులు చెబుతున్నారు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు నగర పోలీసు స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు కేసును విచారిస్తున్నారు.
బెంగళూరులో భర్తను చంపిన భార్య
కర్నాటక రాజధాని బెంగళూరులో ముప్పై ఏళ్ల ఓ వ్యక్తిని ఆయన భార్య, తన సోదరుల సహాయంతో ఐరన్ రాడ్తో కొట్టి చంపింది. ఈ ఘటన బుధవారం రాత్రి జరిగింది. మృతుడిని సాగర్గా గుర్తించారు. అతని భార్య అనిత. అనితకు ఇద్దరు సోదరులు ఉన్నారు. సాగర్, అనితలు ఇద్దరు నేపాల్కు చెందిన వారు.
వారికి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వారికి పడకపోవడంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. రెండు నెలల క్రితం అనిత వరకట్న వేధింపులంటూ భర్త పైన పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తాము వేర్వేరుగా ఉంటున్నప్పటికీ నిత్యం భర్త తన ఇంటికి వచ్చి డబ్బు కోసం డిమాండ్ చేస్తున్నారని ఆమె ఫిర్యాదు చేసింది. ఈ కేసు కొనసాగుతోంది.
సమాచారం మేరకు బుధవారం రాత్రి పదకొండు గంటలకు సాగర్.. అనిత ఇంటికి వెళ్లాడు. డబ్బుల కోసం డిమాండ్ చేశాడు. వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనిత సోదరులు జోక్యం చేసుకున్నారు. ఇరువురి మధ్య గొడవ పెరగడంతో సాగర్ పైన వారు ఇనుప రాడుతో దాడి చేశారు. దీంతో అతను చనిపోయాడు.