పాఠశాలకు బాంబు బెదిరింపు, దున్నపోతుపై కాల్పులు

బాంబు బెదిరింపు
దిల్సుఖ్నగర్లోని ఓ పాఠశాలకు బాంబు బెదిరింపు వచ్చింది. ఎన్ఆర్డిజి పాఠశాలలో బాంబు పెట్టినట్లుగా ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది విద్యార్థులను బయటకు పంపించి పోలీసులకు సమాచారం అందించింది. బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. ఎలాంటి బాంబు లేదని బాంబు స్క్వాడ్ నిర్ధారించింది. స్కూల్కు ఫేక్ కాల్ వచ్చిందని పోలీసులు తేల్చి చెప్పారు.
రైలులో వ్యక్తి ఆత్మహత్య
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జమ్ముతావి-చెన్నై మధ్య నడిచే ఎక్సుప్రెస్లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రైలులోని ఎస్ 3 బోగిలో గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకొని మృతి చెందాడు. సూళ్లూరుపేటలో ఆ వ్యక్తి మృతదేహాన్ని రైల్వే సిబ్బంది గుర్తించింది. రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఆత్మహత్య
వరంగల్ జిల్లా దేవరప్పుల మండలం కోలుకొంలో నిప్పంటించుకొని ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటనలో తల్లీ కొడుకు మృతి చెందారు. కూతురు పరిస్థితి విషమంగా ఉంది.
తగలబడిన డీజిల్ ట్యాంకర్
హైదరాబాదులోని శామీర్పేటలో ఓ డీజిల్ ట్యాంకర్ నడిరోడ్డు పైన తగులబడుతోంది. డీజిల్ ట్యాంక్ తగులబడుతుంటడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
-
రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..!












Click it and Unblock the Notifications