Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణలో సైంధవపాత్ర కెసిఆర్ ఫ్యామిలీదే: గోనె

Gone Prakash Rao
హైదరాబాద్: తెలంగాణ సెంటిమెంట్‌ను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వాడుకుంటున్నారని, అందువల్లనే తెలంగాణవాదులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలంగాణ ప్రాంతానికి చెందిన మాజీ శానససభ్యుడు గోనె ప్రకాశ రావు విమర్శించారు. తెలంగాణలోని మరణాలకు కెసిఆర్ బాధ్యత వహించాలని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం శానససభలో తీర్మానం అవసరం లేదని తెరాస గతంలో చెప్పిందని, ఇప్పుడు తీర్మానం కావాలంటూ పట్టుబడుతూ శానససభను స్తంభింపజేసిందని ఆయన అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర ఏర్పాటుకు శానససభ తీర్మానం అవసరం లేదని కెసిఆర్ కూడా అన్నారని ఆయన గుర్తు చేశారు.

సమైక్యాంధ్ర సభ వ్యాఖ్యలకు స్పందిస్తూ శాసనసభలో తీర్మానం అవసరం లేదని తెరాస శాసనసభ్యులు హరీష్ రావు, కెటి రామరావు కూడా అన్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణలో కెసిఆర్ కుటుంబానిదే సైంధవ పాత్ర అని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీ తీర్మానం లేకుండా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో గతంలో 14 రాష్ట్రాలు ఏర్పడ్డాయని ఆయన గుర్తు చేశారు.

శాసనసభలో తీర్మానమంటూ తెరాస ఆడుతున్న డ్రామాను రుజువు చేస్తానని అన్నారు. దీనిపై ఎవరితోనైనా చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిాపరు. తన ఆరోపణలు రుజువు చేస్తే దేశం విడిచి వెళ్లడానికి తాను సిద్ధంగా ఉన్నానని గోనె అన్నారు. దుమ్ముంటే తన సవాల్‌ను కెసిఆర్ కుటుంబ సభ్యులు స్వీకరించాలని ఆయన అన్నారు. కెసిఆర్, హరీష్ రావు, కెటిఆర్ వ్యాఖ్యలను ఆధారాలతో సహా బయటపెడుతానని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+