తెలంగాణలో సైంధవపాత్ర కెసిఆర్ ఫ్యామిలీదే: గోనె

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం శానససభలో తీర్మానం అవసరం లేదని తెరాస గతంలో చెప్పిందని, ఇప్పుడు తీర్మానం కావాలంటూ పట్టుబడుతూ శానససభను స్తంభింపజేసిందని ఆయన అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర ఏర్పాటుకు శానససభ తీర్మానం అవసరం లేదని కెసిఆర్ కూడా అన్నారని ఆయన గుర్తు చేశారు.
సమైక్యాంధ్ర సభ వ్యాఖ్యలకు స్పందిస్తూ శాసనసభలో తీర్మానం అవసరం లేదని తెరాస శాసనసభ్యులు హరీష్ రావు, కెటి రామరావు కూడా అన్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణలో కెసిఆర్ కుటుంబానిదే సైంధవ పాత్ర అని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీ తీర్మానం లేకుండా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో గతంలో 14 రాష్ట్రాలు ఏర్పడ్డాయని ఆయన గుర్తు చేశారు.
శాసనసభలో తీర్మానమంటూ తెరాస ఆడుతున్న డ్రామాను రుజువు చేస్తానని అన్నారు. దీనిపై ఎవరితోనైనా చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిాపరు. తన ఆరోపణలు రుజువు చేస్తే దేశం విడిచి వెళ్లడానికి తాను సిద్ధంగా ఉన్నానని గోనె అన్నారు. దుమ్ముంటే తన సవాల్ను కెసిఆర్ కుటుంబ సభ్యులు స్వీకరించాలని ఆయన అన్నారు. కెసిఆర్, హరీష్ రావు, కెటిఆర్ వ్యాఖ్యలను ఆధారాలతో సహా బయటపెడుతానని అన్నారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications