వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

3 రోజుల్లో పిఎం పర్యటన: శ్రీనగర్‌లో టెర్రరిస్టుల దాడి

By Pratap
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ నడిబొడ్డున మిలిటెంట్లు దాడికి తెగబడ్డారు. రద్దీగా ఉండే హరి సింగ్ హై స్ట్రీట్‌లో మిలిటెంట్లు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు మరణించారు. ప్రధాని డాక్ట్రర్ మన్మోహన్ సింగ్ మరో మూడు రోజుల్లో జమ్మూ కాశ్మీర్ పర్యటనకు రానున్న నేపథ్యంలో ఈ దాడి జరగడం కలకలానికి దారి తీసింది.

సైలెన్సర్లు బిగించిన పిస్టల్స్‌తో ఉగ్రవాదులు ఒకేసారి జహంగీర్ చౌక్, సరాయ్ బాలాలో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్ మొహమ్మద్ మక్బూల్, కానిస్టేబుల్ నజీర్ అహ్మద్ గాయపడ్డారు.

Jammu and Kashmir

ఆస్పత్రికి తరలిస్తుండగా మక్బూల్ మరణించాడు. ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేసిన తర్వాత నజీర్ అహ్మద్ మరణించాడు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఈ నెల 25వ తేదీన కాశ్మీర్ లోయలో పర్యటించాల్సి ఉంది.

ప్రధాని జూన్ 25వ తేదీన బనిహాల్, ఖాజీగుండ్ మధ్య రైలు సర్వీసును ప్రారంభిస్తారు. ఆ వెంటనే తిరిగి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు.

English summary
Terrorists struck in the heart of the city killing two policemen in the crowded Hari Singh high street, three days ahead of Prime Minister Manmohan Singh's visit to Jammu and Kashmir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X