పిరికివాళ్ల చర్య: ప్రధాని, ఉగ్రదాడిలో రాష్ట్ర జవాన్ మృతి

Manmohan Singh
శ్రీనగర్: ఉగ్రవాద చర్యలను భారత్ సమర్థవంతంగా, సంఘటితంగా ఎదుర్కొంటుందని, దాడులు పిరికివారి చర్య అని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మంగళవారం అన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు జమ్మూ కాశ్మీర్ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విద్యుత్ సమస్య పరిష్కారానికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తోందన్నారు.

మరోవైపు నిన్న ఉగ్రవాదుల దాడిలో ఎనిమిది మంది జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. వారిలో ఒకరు ఆంధ్రా జవాన్ కూడా ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన యాదయ్య ఈ ఉగ్రదాడిలో మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని రేపు హైదరాబాదుకు తరలించనున్నారు.

ప్రధాని పర్యటనకు 24 గంటల ముందు ఉగ్రవాదులు పెట్రేగిపోయిన విషయం తెలిసిందే. ఆర్మీ కాన్వాయ్‌పైనే ఉగ్రవాదులు సోమవారం కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో 8 మంది జవాన్లు మరణించారు. మరో 19 మంది గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. దాడి జరిపింది తామేనని హిజ్బుల్ ముజాహిదీన్ ప్రకటించుకుంది.

జమ్మూ కాశ్మీరులో ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాద దాడిని ప్రధాని మన్మోహన్ సింగ్ వెంటనే ఖండించారు. ఆ రాష్ట్రంలో శాంతిని నెలకొల్పాలన్న భద్రత దళాల స్తైర్యాన్ని ఇటువంటి పిరికిపంద చర్యలు అడ్డుకోలేవని వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా, ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాద దాడిని బిజెపి కూడా తీవ్రంగా ఖండించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+