నీళ్ల బాటిల్: అమ్మాయితో మూత్రం తాగించిన విద్యార్థులు

పదవ తరగతి విద్యార్థ్ధిని పైకి తోటి విద్యార్థ్ధి ఒక చిన్న పిల్లాడిని నెట్టాడు. దీంతో ఆమె ఆ విద్యార్థ్ధిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెపై ఆ విద్యార్థ్ధి కక్ష పెంచుకుని మరో ఇద్దరితో కలిసి ఆ విద్యార్థిని మంచి నీళ్ల బాటిల్ను తీసుకొని అందులోని నీటిని తీసివేసి, మూత్రం పోసి ఉంచాడు.
ఆ విద్యార్ధినిని బాటిల్లో ఉన్న మూత్రం తాగి వాంతులు చేసుకుంది. ఆమెను ఆసుపత్రికి తరలించగా మూత్రం తాగినట్లు వైద్యులు వెల్లడించారు. పాఠశాల యాజమాన్యం ముగ్గురు విద్యార్థులను గుర్తించి వారికి టిసిలు ఇచ్చి పంపేశారు. ఈ ఘటన గత నెల 28వ తేదిన జరిగింది. తల్లితండ్రులు, ప్రధానోపాధ్యాయురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎలుగుబంటి హల్చల్
చిత్తూరు జిల్లా తిరుమలలో సోమవారం సాయంత్రం ఓ ఎలుగుబంటు హల్చల్ చేసింది. శంకుమిట్ట నామాలపార్కు నుంచి రోడ్డు పైకి వచ్చి పద్మావతినగర్కు వెళ్లే దారిన పరుగులు తీసింది. దీనిని గమనించి పాదచారులు, వాహనదారులు భయాందోళనతో పరుగులు తీశారు. పద్మావతి ఉద్యానవనంలో పనిచేస్తున్న టిటిడి సిబ్బంది ఆ ఎలుగుబంటును అడవిలోకి తరిమేయడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications