వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విషాదం: తెలంగాణ కోసం అమ్మాయి ఆత్మహత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Girl commits suicide for Telangana
చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం మొగిలిదోరి గ్రామానికి చెందిన అరిగి శిరీష (16) పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకుంది. తెలంగాణకోసమే ఆత్మహత్య చేసుకున్నట్టు ఆమె సూసైడ్ నోట్‌లో తెలిపింది. ఆమె బ్యాగ్‌లో సూసైడ్ నోట్ లభించింది. అరిగె సైదులు, అనితల కుమార్తె శిరీష నల్లగొండలో హస్టల్‌లోవుంటూ పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతోంది. బుధవారం ఆమెను తల్లి ఇంటికి తీసుకొచ్చింది.

బుధవారం సాయంత్రం శిరీష పురుగుల మందు తాగడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ శిరీష గురువారం మృతిచెందింది. తెలంగాణపై తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు డ్రామాలాడుతున్నాయని, ఇక తెలంగాణ రాదేమోనని అన్పించడంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఆమె బ్యాగులో లభించిన ఓ సూసైడ్ నోట్‌లో రాసి ఉంది.

తెలంగాణ రాకుండా సీమాంధ్ర నాయకులు అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించింది. తెలంగాణ ఇస్తామని కాంగ్రెసు ఇస్తున్న మాటలను నమ్మవద్దని, పంచాయతీ ఎన్నికల కోసం కాంగ్రెసు నాటకాలు ఆడుతోందని ఆమె తన సూసైడ్ నోట్‌లో రాసింది. తెలంగాణ కోసం తనదే చివరి మరణం కావాలని ఆమె ఆశించింది.

మృతురాలి మేనమామ నర్సింహ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

English summary

 A 16 year old girl Sirisha has commited suicide for the cause of Telangana in Nalgonda district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X