దోషులుగా తేలితే పోటీకి నో, జైలు నుండి కూడా: సుప్రీం
న్యూఢిల్లీ: క్రిమినల్ కేసుల్లో రాజకీయ నాయకులు దోషులుగా తేలితే వారు ఎన్నికలలో పోటీకి అర్హులు కాదని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు బుధవారం సంచలన తీర్పు ఇచ్చింది. ప్రజాప్రతినిథ్యం చట్టంలోని 8(4) నిబంధన న్యాయసమ్మతం కాదని కోర్టు తేల్చి చెప్పింది.

క్రిమినల్ కేసుల్లో చిక్కుకొని దోషులుగా తేలితే పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు, ఇతర రాజకీయ నాయకులు పోటీకి అనర్హులు అన్నారు. కేసులలో ఎవరైనా దోషులుగా తేలిన వెంటనే వారు పదవులకు అనర్హులు అని తేల్చి చెప్పింది. దోషులుగా తేలిన వారు జైలు నుండి పోటీ చేయడం కుదరదని, పదవులు కోల్పోతారని తెలిపింది.
ప్రజాప్రాతినిథ్య చట్టంలో అనర్హత నుంచి తప్పించుకునే నిబంధన సరికాదని పేర్కొంది. పాత కేసులకు ఈ తీర్పు వర్తించదని చెప్పింది. ఇక నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తుందని పేర్కొంది. చట్టం లొసుగు నుంచి నేరస్థులు తప్పించుకుంటున్నారని కోర్టు అభిప్రాయపడింది. అప్పీలు పెండింగులో ఉన్నంత కాలం ప్రజాప్రతినిధులు అనర్హులు కాదన్న నిబంధనను కోర్టు తోసిపుచ్చింది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications