తెలంగాణపై టెన్షన్: సోనియా గాంధీతో కిరణ్ రెడ్డి భేటీ

కిరణ్ కుమార్ రెడ్డి గురువారం సాయంత్రం కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్తో సమావేశమయ్యారు. అయన దిగ్విజయ్ సింగ్కు రోడ్ మ్యాప్ అందించినట్లు సమాచారం. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కూడా గురువారం సాయంత్రం దిగ్విజయ్ సింగ్ను కలిసి రోడ్ మ్యాప్లు అందించారు. దిగ్విజయ్ సింగ్ వారితో గురువారంనాడు పెద్దగా చర్చలు జరపలేదని తెలుస్తోంది.
ఇదిలావుంటే, తెలంగాణ అంశంతో ఢిల్లీ రాజకీయాలు వేడెక్కాయి. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నాయకులు ఢిల్లీలో మకాం వేశారు. సీమాంధ్ర నాయకులు అధిష్టానం పెద్దలను కలుసుకోవడంలో తీరిక లేకుండా గడుపుతున్నారు. తెలంగాణ మంత్రులు, కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్తో భేటీ అయ్యారు. మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డితో సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు భేటీ అయ్యారు.
తెలంగాణ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని సీమాంధ్ర నేతలు ఎవరికి వారు లాబీయింగ్ చేస్తున్నారు. ఈ స్థితిలో కాంగ్రెసు కోర్ కమిటీ ఏం నిర్ణయం వెలువరిస్తుందనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది.












Click it and Unblock the Notifications